Senate Buildings: యూఎస్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోకి (Senate Buildings) షూటర్ ప్రవేశించినట్లు సమాచారం అందడంతో కలకలం రేగింది. దీని తర్వాత US క్యాపిటల్ పోలీసులు సెనేట్ కార్యాలయాన్ని సోదా చేశారు. అయితే పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ సెనేట్ భవనాల్లోకి ఆయుధాలు కలిగి ఉన్న ఓ అగంతకుడు ప్రవేశించినట్లు సమాచారం రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ సెనేట్ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తర్వాత సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్ సెనేట్ భవనాల్లో సంచరిస్తున్నట్లు 911కి ఫోన్ చేసి ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే అక్కడున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరిని బయటకు తీసుకొచ్చారు.
Also Read: Record Rainfall: చైనాను వణికిస్తున్న తుఫాను.. 140 ఏళ్ళ రికార్డు బ్రేక్..!
దాడికి పాల్పడ్డాడన్న వార్తలు అవాస్తవమని తేలింది
వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి హ్యూ కేర్వ్ మాట్లాడుతూ.. పోలీసులు షూటర్ను కనుగొనలేదని, యుఎస్ క్యాపిటల్ కాంప్లెక్స్లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు నివేదించబడిన తర్వాత కాల్పులు జరిగినట్లు నివేదించలేదని చెప్పారు. భవనంలో ఒక షూటర్ దాక్కున్నట్లు సమాచారం అందింది. అది తప్పుడు సమాచారం అని తేలింది. ఎవరూ గాయపడలేదు, షూటర్ కనుగొనబడలేదని ఆయన అన్నారు. అంతకముందు ‘క్యాపిటల్ సెనేట్ కార్యాలయాల భవనాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఎవరూ రావద్దు. ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటాం అని క్యాపిటల్ పోలీసులు ట్వీట్ చేశారు.
పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు
మాకు 911 కాల్ వచ్చింది. సెనేట్ కార్యాలయ భవనాలు, పరిసర ప్రాంతాలలో శోధన కొనసాగిస్తున్నాము” అని అధికారులు తెలిపారు. మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నందున దయచేసి ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని వారు ప్రజలను కోరారు. మీరు ఆ ప్రాంతంలో ఉంటే మా అధికారుల సూచనలను పాటించండి అని పోలీసు అధికారి పౌరులకు చెప్పారు. భయభ్రాంతులు సృష్టించేందుకు బెదిరింపు ఫోన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.