ఉక్రెయిన్ రాజధాని కీవ్ మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల తర్వాత నగరంలో పొగలు కమ్ముకున్నాయని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. ప్రెసిడెంట్ జెలెన్స్కీ బాలిలో సమావేశమవుతున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల నాయకులకు వీడియో ప్రసంగం చేసిన కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడుల హెచ్చరికలను అనుసరించి పేలుళ్లు సంభవించాయి. “#G20 వద్ద @Zelenskiy శక్తివంతమైన ప్రసంగానికి రష్యా కొత్త క్షిపణి దాడితో ప్రతిస్పందించింది. క్రెమ్లిన్ నిజంగా శాంతిని కోరుకుంటుందని ఎవరైనా అనుకుంటున్నారా? దానికి విధేయత కావాలి. కానీ రోజు చివరిలో ఉగ్రవాదులు ఎల్లప్పుడూ ఓడిపోతారు” అని అధ్యక్ష సిబ్బంది చీఫ్ ఆండ్రీ యెర్మాక్ ట్విట్టర్లో దాడి గురించి రాసుకొచ్చారు. ఈ దాడి గురుంచి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Russia responds to @ZelenskyyUa's powerful speech at #G20 with a new missile attack. Does anyone seriously think that the Kremlin really wants peace? It wants obedience. But at the end of the day, terrorists always lose.
— Andriy Yermak (@AndriyYermak) November 15, 2022