UK Elections: భారతీయ సంతతకి చెందిన వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా ఉన్న రాణిస్తున్నారు. తాజాగా జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో సైతం భారత సంతతికి చెందిన వ్యక్తులు తమ హవా కొనసాగించారు. ఏకంగా 28 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు బ్రిటన్ ఎన్నికల్లో గెలుపొంది ఔరా అనిపించారు. బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో (UK Elections) భారతీయ సంతతికి చెందిన 28 మంది ఎంపీలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. UK ఎన్నికల ఫలితాలు శుక్రవారం (జూలై 5) వెలువడ్డాయి. ఇందులో రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించి 400 సీట్లకు పైగా గెలుచుకుంది. లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి అయ్యారు. స్టార్మర్ 2020లో జెరెమీ కార్బిన్ స్థానంలో లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు.
బ్రిటన్లో గెలిచిన భారతీయ సంతతికి చెందిన 28 మంది ఎంపీలలో రికార్డు స్థాయిలో 12 మంది సిక్కు సమాజానికి చెందినవారు. ఇందులో హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. గెలిచిన సిక్కు ఎంపీలందరూ లేబర్ పార్టీకి చెందిన వారే. వీరిలో తొలిసారిగా ఎన్నికైన ఎంపీలు 9 మంది ఉండగా, మూడోసారి ప్రజావాణికి అవకాశం ఇచ్చిన ఎంపీలు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా ఒక సిక్కు ఎంపీకి రెండోసారి హౌస్ ఆఫ్ కామన్స్ సందర్శించే అవకాశం లభించింది.
Also Read: WhatsApp Chats: వాట్సాప్ చాట్, వీడియోలు సాక్ష్యంగా చెల్లుబాటు అవుతాయా..?
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన భారతీయ సంతతి నాయకులు కూడా విజయం
రిషి సునక్ యార్క్షైర్లోని రిచ్మండ్ & నార్తలర్టన్ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచిన భారతీయ సంతతికి చెందిన ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు, మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్, ప్రీతి పటేల్, సునక్.. గోవా మూలానికి చెందిన క్యాబినెట్ సహోద్యోగి క్లైర్ కౌటిన్హో కూడా తమ తమ స్థానాలను గెలుచుకున్నారు. వెస్ట్ హెర్ట్ఫోర్డ్షైర్ నుంచి గగన్ మొహింద్రా, లీసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా గెలుపొందారు.
We’re now on WhatsApp : Click to Join