తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను బహుమతిగా అందజేశారు. పాకిస్థాన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ హోదాలో అందుకున్న విలువైన బహుమతులు తప్పనిసరిగా ‘తోషఖానా’కు అప్పగించాలి.

Published By: HashtagU Telugu Desk
The Imran Khan-led PTI party has announced that it is boycotting the PoK elections due to the "absence of an environment for free and fair elections."

The Imran Khan-led PTI party has announced that it is boycotting the PoK elections due to the "absence of an environment for free and fair elections."

. అడియాలా జైలులోనే విచారణ జరిపిన పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు

. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామన్న న్యాయవాదులు

. కోర్టు తీర్పు..జైలు శిక్షతో పాటు జరిమానా

Pakistan : పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన తోషఖానా అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు మరో 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన భార్య బుష్రా బీబీకి కూడా సమానమైన శిక్షను ఖరారు చేస్తూ పాకిస్థాన్ కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను బహుమతిగా అందజేశారు. పాకిస్థాన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ హోదాలో అందుకున్న విలువైన బహుమతులు తప్పనిసరిగా ‘తోషఖానా’కు అప్పగించాలి. అయితే ఈ ఆభరణాలను ఇమ్రాన్ ఖాన్ తోషఖానాకు సమర్పించకుండా, వ్యక్తిగత లాభం కోసం విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కేసు నమోదై, విచారణ కొనసాగింది.

ఈ కేసులో తాజా విచారణ రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా జైలులోనే న్యాయమూర్తి అర్జుమంద్ విచారణ జరిపి, ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఇద్దరికీ 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు, ఒక్కొక్కరిపై 1.64 కోట్ల పాకిస్థానీ రుపాయల జరిమానాను కూడా కోర్టు విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, నేర తీవ్రత దృష్ట్యా కఠిన శిక్ష తప్పదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.

ఈ తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండగా, తాజా శిక్ష ఆయన రాజకీయ భవితవ్యంపై మరింత ప్రభావం చూపనుంది. మరోవైపు, ఈ తీర్పును తమకు అనుకూలంగా రాజకీయ ప్రత్యర్థులు ఉపయోగించుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఈ తీర్పును అంగీకరించబోమని స్పష్టం చేశారు. కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా తమ వాదన బలంగా ఉందని తెలిపారు. తోషఖానా కేసు తీర్పుతో పాకిస్థాన్‌లో అవినీతి, అధికార దుర్వినియోగం అంశాలపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది. ఈ కేసు చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

 

 

 

  Last Updated: 20 Dec 2025, 11:03 PM IST