South Korea : సియోల్ ఘటనపై రిషిసునాక్ , బిడెన్ సహా ప్రపంచ నేతల సంతాపం..!!

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 149మంది మరణించారు. మరో వందమందికిపై గాయపడ్డారు. ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుకైన వీధిలోకి ఒకేసారి లక్షమంది రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కొరియా మీడియా వెల్లడించింది. సియోల్ ఘటనపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన వార్త అని ట్వీట్ చేశారు. ఈ […]

Published By: HashtagU Telugu Desk
Korea

Korea

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 149మంది మరణించారు. మరో వందమందికిపై గాయపడ్డారు. ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుకైన వీధిలోకి ఒకేసారి లక్షమంది రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కొరియా మీడియా వెల్లడించింది. సియోల్ ఘటనపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన వార్త అని ట్వీట్ చేశారు. ఈ దు:ఖ సమయంలో బాధితులకు, దక్షిణ కొరియా పౌరులందరికీ మా సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ సమయంలో దక్షిణ కొరియా ప్రజలకు అండగా ఉంటాము. గాయపడిన వారు త్వరగా కోలోకోవాలని కోరకుంటున్నాము అని ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా అండగా నిలుస్తోంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంతాపం వ్యక్తం చేశారు. కెనడా ప్రజల తరపున నా సంతాపం తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు. ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంతాపం ప్రకటించారు.

 

  Last Updated: 30 Oct 2022, 06:07 AM IST