Site icon HashtagU Telugu

Snake in Plane: ఎయిరిండియా విమానంలో పాము.. ప్రయాణికులలో కలకలం

Air India Crew

Air India Crew

పాము అనే పేరు చాలా మందికి భయం వేస్తుంది. విమానంలో పాము (Snake in Plane) ఉంటుందని ఎవరూ ఊహించలేరు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో పాము (Snake in Plane) కనిపించడంతో కలకలం రేగింది. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు దాని కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది. ఈ మేరకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ అధికారి ఒకరు సమాచారం అందించారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుపుతామని చెప్పారు.

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి దుబాయ్ వెళ్లిన విమానంలోని కార్గో క్యాబిన్‌లో పామును సిబ్బంది గుర్తించారు. దీంతో అత్యవసర సిబ్బంది పామును బయటకు తీసుకొచ్చారు. కార్గో క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిరిండియా అధికారులు తెలిపారు.

అందిన సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఫ్లైట్ నంబర్ B737-800లో చోటుచేసుకుంది. ఈ విమానం కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ వెళ్లింది. అయితే పాము వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పాముని సురక్షితంగా విమానం నుంచి దించేశారు. అయితే విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. దుబాయ్ విమానాశ్రయానికి చేరుకోగానే విమానం కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం ఎయిర్‌పోర్టు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రాథమికంగా చూస్తే ఈ ఘటన గ్రౌండ్ లెవెల్లో తప్పని అన్నారు. దీనిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Aslo Read: Jackpot : రాత్రికి రాత్రే ఏకంగా 165 మందికి జాక్‌పాట్‌..!

విమానంలో పాము కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 10న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లే ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ అయింది. ప్రయాణం మధ్యలో విమానం వెలుతురులో ఏదో పాకుతున్నట్లు ప్రయాణికులు చూశారు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత విమానంలో పాము ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రయాణికుల్లో కలకలం రేగింది. ఇది కాకుండా విమానంలో పాములు కనిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి.

Exit mobile version