School Collapse In Central Nigeria: ఉత్తర మధ్య నైజీరియా (School Collapse In Central Nigeria)లో శుక్రవారం తరగతి జరుగుతుండగా రెండంతస్తుల పాఠశాల కూలి 22 మంది విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల నుంచి 132 మంది విద్యార్థులను రక్షించి చికిత్స అందిస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట శిథిలాల కింద మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, అయితే వారిలో 132 మంది రక్షించబడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. 22 మంది విద్యార్థులు మరణించారని తెలిపారు. డజన్ల కొద్దీ బంధువులు పాఠశాల దగ్గర గుమిగూడారు. ఘటన స్థలంలో రోదనలు మిన్నంటాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండు అంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు చనిపోగా, 120 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు శిథిలాలలో చిక్కుకుపోయారు. ప్రమాదం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పని జరుగుతోంది. నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెస్క్యూ, హెల్త్ వర్కర్స్తో పాటు భద్రతా దళాలను సంఘటనా స్థలానికి మోహరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ భవనం కూలిన వెంటనే రెస్క్యూ ప్రారంభించింది. అలాగే ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, చిక్కుకున్న విద్యార్థుల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు చెప్పారు. పాఠశాల “బలహీనమైన నిర్మాణం, నది ఒడ్డున దాని స్థానం” ఈ విషాదానికి కారణమని ప్రభుత్వం ఆరోపించింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. ఆఫ్రికా ఖండంలో అత్యధిక సంఖ్యలో భవనాలు కూలిపోయాయి.
మృతుల సంఖ్యను ఇంకా అధికారులు వెల్లడించలేదు
నైజీరియాలోని బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కళాశాలలో మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కానీ సమీపంలోని ఆసుపత్రిలో ప్రత్యక్ష సాక్షి కథనాన్ని ఉటంకిస్తూ ఛానెల్లు చాలా మంది మరణించారని, కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
నైజీరియాలో భవనం కూలడం సర్వసాధారణమైంది
ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో భవనాలు కూలిపోవడం సర్వసాధారణమైపోయింది. గత రెండేళ్లలో ఇలాంటి సంఘటనలు డజనుకు పైగా నమోదయ్యాయి. భవనం భద్రతా నియమాలను అమలు చేయడంలో వైఫల్యం, పేలవమైన నిర్వహణ కారణంగా అధికారులు తరచుగా ఇటువంటి విపత్తులు జరుగుతున్నాయి.