FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ విజయం…ఆటగాళ్లకు కానుకల వర్షం కురిపించిన సౌదీ ప్రభుత్వం..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 05:57 PM IST

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాపై పసికూన సౌదీఅరేబియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాపై అద్భుత విజయం తర్వాత సౌదీ ఆటగాలపై కానుకల వర్షం కురిపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ యువరాజుమహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బహుమతిగా ఇవ్వనుంది సౌదీ ప్రభుత్వం. ఈ కారు విలువ ధర 500000యూరోలు ( దాదాపు రూ. 4.25కోట్లు) సౌదీ అరేబియా విజయం తర్వాత జట్టు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ గ్రాండ్ విక్టరికీ సంబంధించి దేశమంతా పండగ వాతావరణం నెలకొది. సౌదీ రాజు సల్మాన్ గత బుధవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌదీపై అర్జెంటీనా జట్టు ఓటమి తర్వాత దాన్ని స్థానాన్ని కోల్పోయింది. లియోనెల్ మెస్సీ నేత్రుత్వంలోని ఈ జట్టు గత 36 మ్యాచులలో విజేతగా ఉంది.

కాగా సౌదీ, అర్జెంటీనా, మెక్సీకో , పోలాండ్ లతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఇప్పుడు రానున్న మ్యాచులో పోలాండ్, మెక్సికోతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పోలాండ్ ను ఓడిస్తే…ప్రీకార్వర్ట్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది.