Iran : ప్రతీకార దాడులు..ఇజ్రాయెల్‌పై వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్‌

వీటిలో చాలావరకు డ్రోన్లను ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు గగనతలంలోనే గుర్తించి తిప్పికొట్టాయి. కానీ ఈ దాడుల వల్ల ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌ ఈ చర్యను పూర్తిగా ప్రతీకార చర్యగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఇటీవల టెహ్రాన్‌ సమీపంలో జరిగిన గూఢచర్య దాడిలో తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తలు హతమయ్యారని ఇరాన్‌ ఆరోపించింది.

Published By: HashtagU Telugu Desk
Retaliatory attacks..Iran launches 100 drones at Israel

Retaliatory attacks..Iran launches 100 drones at Israel

Iran : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ఇటీవలి కాలంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా, ఇరాన్‌ శనివారం అర్ధరాత్రి భారీ స్థాయిలో డ్రోన్‌ దాడికి దిగింది. ఒక్కసారిగా 100కి పైగా డ్రోన్లను ఇజ్రాయెల్‌పై విసిరింది. అయితే వీటిలో చాలావరకు డ్రోన్లను ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు గగనతలంలోనే గుర్తించి తిప్పికొట్టాయి. కానీ ఈ దాడుల వల్ల ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌ ఈ చర్యను పూర్తిగా ప్రతీకార చర్యగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఇటీవల టెహ్రాన్‌ సమీపంలో జరిగిన గూఢచర్య దాడిలో తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తలు హతమయ్యారని ఇరాన్‌ ఆరోపించింది. దాడిలో ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌ జనరల్‌ మహ్మద్‌ బాఘేరి, పారామిలిటరీ విభాగం  రెవల్యూషనరీ గార్డ్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీతో పాటు మరో ఇద్దరు అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు.

Read Also: PM Modi : అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని సమీక్ష.. విజయ్‌ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీ

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల ప్రధాన లక్ష్యం ఇరాన్‌లోని అణు స్థావరాలే. నాటో సమాచారం ప్రకారం, ఈ దాడులు చాలా సంక్లిష్టమైన సమాచారంతో ముందుగానే ప్లాన్‌ చేసి అమలు చేశాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఈ పరిణామాలను తీవ్రంగా గమనిస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు కానీ, మద్యప్రాచ్యంలో శాంతి భద్రతల పరంగా ఇది సీరియస్‌ మలుపు. ఇరాన్‌ డ్రోన్‌ దాడి ప్రధానంగా ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డ్రోన్లలో కొన్నింటిని హిజ్బొల్లా తరఫున లెబనాన్‌ నుంచి కూడా ప్రయోగించారని సమాచారం. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్‌ జనాభాలో భయాందోళనలు పెరిగాయి. ప్రజలు బంకర్‌లలోకి ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇజ్రాయెల్‌ మాత్రం ఈ దాడులపై తీవ్ర ప్రతిస్పందన ఇస్తుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇది కేవలం ప్రారంభమే. మాకు ముప్పు వస్తే గట్టిగా తిరిగి బుద్ధి చెబుతాం అని ఇజ్రాయెల్‌ ప్రధాని బిన్యామిన్‌ నేతన్యాహూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు మిడుస్తున్న ఈ ప్రాంతంలో, అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌ డ్రోన్‌ దాడుల తరువాతి గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌ మరోసారి అణు కేంద్రాలపై వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కోరే అవకాశం ఉంది. మొత్తంగా ఈ దాడులు మద్యప్రాచ్యంలో భద్రతా సమీకరణాలను పూర్తిగా మారుస్తున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉన్న విద్వేషం ఇప్పుడు మూడో దేశాలపై ప్రభావం చూపే స్థాయికి చేరుతోంది. త్వరలోనే అంతర్జాతీయ సమాజం స్పందించకపోతే, ఇది పెద్ద స్థాయి యుద్ధానికి దారితీయొచ్చు.

Read Also: Parag Tradition : హమ్మయ్య.. మధ్యప్రదేశ్ లో వింత ఆచారానికి బ్రేక్ !! 

 

  Last Updated: 13 Jun 2025, 12:23 PM IST