Site icon HashtagU Telugu

Modi In Bali : కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభం..ప్రపంచ వినాశనాన్ని కలిగించాయి..!!

Modi busy

Modi G20

జి20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలి చేరుకున్నారు. బాలిలోని అపూర్వ కెంపిన్స్కీ హోటల్‌లో సమ్మిట్ జరుగుతోంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశమయ్యారు. తన ప్రసంగంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ బహిరంగంగా మాట్లాడారు. కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి వినాశం కలిగించాయన్నారు. రష్యా  కాల్పుల విరమణను ఆపడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలి అన్నారు మోదీ. గత శతాబ్దంలో, ప్రపంచ యుద్ధం ప్రపంచంలో విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత ఆనాటి నాయకులు శాంతి మార్గాన్ని అనుసరించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మా వంతు వచ్చిందన్నారు మోదీ.