Site icon HashtagU Telugu

Operation Sindoor: ఆప‌రేష‌న్ సిందూర్‌.. పాక్‌కు భారీ నష్టం, 9 యుద్ధ విమానాలు ధ్వంసం!

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రతీకార దాడిని చేసింది. ఈ దాడులను పాకిస్థాన్ ఊహించి ఉండకపోవచ్చు. ఈ ప్రతీకార దాడుల్లో పాకిస్థాన్‌కు జరిగిన నష్టాల వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. మొదటగా భారత దాడిలో 6 పాకిస్థానీ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంఖ్య 9కి చేరింది.

నివేదిక‌ల‌ ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత నిర్వహించిన నష్ట నిర్ధారణలో పాకిస్థాన్ వైమానిక, భూ సైనిక సౌకర్యాలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్)కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయి. అంతేకాకుండా రెండు అధిక విలువైన నిఘా విమానాలు, ఒక సీ-130 హర్క్యులస్ రవాణా విమానం కూడా ధ్వంసం చేశారు. ఇంకా పదికి పైగా సాయుధ డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి.

Also Read: Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత

ఇంతకుముందు భారత దాడిలో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్ (పీఓజేకే), పాకిస్థానీ పంజాబ్‌లో జరిగిన వైమానిక ఘర్షణల సమయంలో ఆరు పాకిస్థానీ యుద్ధ విమానాలు కూల్చివేయబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ విమానాలను భారత గ్రౌండ్-బేస్డ్ మిస్సైల్ సిస్టమ్స్, వైమానిక హెచ్చరిక రాడార్లు ట్రాక్ చేసి ధ్వంసం చేశాయి. ఇప్పుడు వచ్చిన కొత్త సమాచారం ప్రకారం.. ఒక ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్ (ఈసీఎం) విమానం భారతదేశ లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్ సుదర్శన్ ద్వారా 300 కిలోమీటర్ల దూరంలో కూల్చివేశారు.

రెండో విమానం స్వీడిష్ మూలానికి చెందినది. పాకిస్థాన్‌లోని భోలేరీ ఎయిర్‌బేస్‌లో ఉంది. ఇది క్రూయిజ్ మిస్సైల్ దాడిలో నాశనం అయింది. శాటిలైట్ చిత్రాలలో విమాన హ్యాంగర్ పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపించింది. అలాగే ముల్తాన్ సమీపంలోని ఒక కేంద్రంపై డ్రోన్ దాడిలో పీఏఎఫ్‌కు చెందిన సీ-130 లాజిస్టిక్స్ విమానం నాశనం అయింది.

భారతదేశ రాఫెల్, సుఖోయ్-30 విమానాల ద్వారా జరిగిన ఒక దాడిలో వింగ్ లూంగ్ సిరీస్‌కు చెందిన కనీసం పది డ్రోన్లు ఒక హ్యాంగర్‌తో సహా నాశనం అయ్యాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు జమ్మూ-కాశ్మీర్, రాజస్థాన్‌లో భారత సరిహద్దులోకి ప్రవేశించిన అనేక పాకిస్థానీ డ్రోన్లను కూల్చివేశాయి.

భారతదేశం ఎంత లోతుగా దాడి చేసింది?

లీక్ అయిన పాకిస్థానీ సైనిక నివేదిక “ఆపరేషన్ బునియాన్ ఉన్ మర్సూస్” నుండి భారతదేశం అదనంగా 7 ప్రదేశాలపై కూడా దాడులు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని భారతదేశం అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రదేశాలన్నీ సైనిక ఠాణాలుగా ఉన్నాయి.

భారతదేశం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తొమ్మిది ముఖ్యమైన ప్రదేశాలపై దాడులు చేసింది. వీటిలో బహవల్‌పూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం మురిద్కేలో లష్కర్-ఎ-తొయిబా శిబిరం ఉన్నాయి. పీఓజేకేలోని ముజఫ్ఫరాబాద్, కోట్లీ, రావలకోట్, భింబర్, చక్వాల్‌లలో కూడా దాడులు జరిగాయి. మాక్సార్ టెక్నాలజీ శాటిలైట్ చిత్రాలు ఈ లక్ష్యాలకు జరిగిన తీవ్ర నష్టాన్ని ధృవీకరించాయి.

 

Exit mobile version