Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్లో అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు. ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఉక్రెయిన్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. కీవ్లోని మార్టిరాలజిస్ట్ ఎగ్జిబిషన్లో ఇరువురు నాయకులు కలుసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై ప్రధాని మోదీ చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చాలా బాధగా కనిపించారు. ఈ క్రమంలో మోడీ అతడి భుజంపై చేయి వేసి కొండంత ధైర్యాన్నిచ్చారు.
#WATCH | PM Modi and Ukrainian President Volodymyr Zelenskyy honour the memory of children at the Martyrologist Exposition in Kyiv pic.twitter.com/oV8bbZ8bQh
— ANI (@ANI) August 23, 2024
ఆగస్ట్ 23 ఉక్రెయిన్ జాతీయ జెండా దినోత్సవం. ఉక్రెయిన్ మరియు భారతదేశం మధ్య అనేక పత్రాలపై సంతకాలు జరుగుతాయని కూడా భావిస్తున్నారు.అంతకుముందు పోలాండ్ నుండి రైల్ ఫోర్స్ వన్ ద్వారా 10 గంటల రైలు ప్రయాణం తర్వాత ప్రధాని మోదీ కీవ్ చేరుకున్నారు. స్టేషన్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది, అనంతరం హయత్ హోటల్లో భారతీయ ప్రవాసులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. భారతదేశం అనుసరిస్తున్న శాంతి మరియు అహింస ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కీవ్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రధాని మోడీ. అదే సమయంలో యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన కొన్ని చిత్రాలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi arrived at Kyiv Central Railway Station from Poland to begin his one-day visit to Ukraine.
This is the first visit by an Indian Prime Minister to Ukraine since its independence from the Soviet Union in 1991. pic.twitter.com/uIxlPkTX63
— ANI (@ANI) August 23, 2024
గత నెలలో రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఉక్రెయిన్లోని పరిస్థితులపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించిన నేపథ్యంలో కీవ్ పర్యటన జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తన వైఖరిని నిలకడగా కొనసాగించింది. చర్చలు మరియు దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారాన్ని భారతదేశం సూచించింది. జూన్ 14న ఇటలీలోని అపులియాలో జరిగిన 50వ G7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ గతంలో అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదం గురించి చర్చించారు. శాంతియుత తీర్మానానికి భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు.
#WATCH | Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi in Ukraine's Kyiv pic.twitter.com/NbXTxGKKNx
— ANI (@ANI) August 23, 2024
దౌత్యపరమైన ప్రయత్నాలే కాకుండా, భారత్ ఉక్రెయిన్కు అవసరమైన మందులు మరియు వైద్య పరికరాలతో సహా గణనీయమైన మానవతా సహాయాన్ని అందించింది, ఉక్రేనియన్ ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఇప్పటికీ నిరూపితమైంది.
Also Read: Pawan Kalyan : అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్