Site icon HashtagU Telugu

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. 1000 మందికిపైగా మృతి..!

Bangladesh Violence

Bangladesh Violence

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హింసాత్మక ప్రదర్శనలు (Bangladesh Violence) జరిగాయి. ప్రజల ఇళ్లకు నిప్పు పెట్టారు. ప్రజలను బహిరంగంగా కాల్చి చంపారు. మానవహారం నిర్వహించారు. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మొత్తం నిరసనలకు దిగింది. దీని తర్వాత షేక్ హసీనా అధికారం కూడా కోల్పోయింది. ఆ తర్వాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో జరిగిన ప్రాణనష్టం గురించిన భయంకరమైన నిజాన్ని వెల్లడిస్తూ ఒక నివేదిక వచ్చింది.

400 మందికి పైగా కంటి చూపు కోల్పోయారు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిరసనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ఈ విషయాన్ని వెల్లడించారు. ఢాకాలోని రాజర్‌బాగ్‌లోని సెంట్రల్ పోలీస్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా నూర్జహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో పాటు నూర్జహాన్ షాకింగ్ విషయం చెప్పారు. పోలీసుల చర్యలో 400 మందికి పైగా కంటి చూపు కోల్పోయారని అన్నారు. ఇందులో విద్యార్థులు, సామాన్యులు కూడా ఉన్నారు. వారిలో కొందరికి ఒక కన్ను, మరికొందరికి రెండు కళ్లలో చూపు పోయిందని తెలిపారు.

Also Read: Apples: ఎర్రటి ఆపిల్స్ కొంటున్నారా..? అయితే ఈ వార్త మీకోస‌మే..!

తల, కాళ్ల‌కు గాయాలు

ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా నూర్జహాన్ బేగం గాయపడిన పోలీసు సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అధికారులకు తలలు, కాళ్లపై గాయాలయ్యాయని తెలిపారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాత్కాలిక ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని బేగం తెలిపారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

చికిత్స కోసం దాతలకు విజ్ఞప్తి

నూర్జహాన్ మాట్లాడుతూ.. కొందరికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది కాళ్లు కూడా తీసివేయాల్సి వచ్చింది. వారి చికిత్స కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. విదేశాల నుంచి వైద్యుల బృందాన్ని తీసుకురావాలని దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అనేక సంస్థలు, ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఉద్యోగాలలో వివాదాస్పద కోటాను వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఉద్యమం చేసిన విష‌యం తెలిసిందే. కొద్దిసేపటికే అది ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక ఘర్షణగా మారింది. తర్వాత ఈ ఉద్యమం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా మారింది. దీంతో ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతుంది. ప్రస్తుతం 84 ఏళ్ల నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది.