North Korean Soldiers: ఉత్తర కొరియా సైనికులను చంపిన ఉక్రెయిన్‌.. కిమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు?

రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్‌లను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉత్తర కొరియా సైనికులు మానిటరింగ్ పోస్ట్‌ల సంఖ్యను పెంచారు.

Published By: HashtagU Telugu Desk
North Korean Soldiers

North Korean Soldiers

North Korean Soldiers: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 100 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా కూడా తన సైన్యాన్ని (North Korean Soldiers) పంపింది. ఈ యుద్ధంలో రష్యాకు సహాయం చేసేందుకు ఉత్తర కొరియా తన సైన్యాన్ని పంపింది. ఇటీవల ఉక్రెయిన్‌లో జరిగిన దాడిలో కిమ్ జాంగ్ ఉన్ సైన్యానికి చెందిన 100 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIU) తన వెబ్‌సైట్‌లో రష్యాతో పాటు ఉత్తర కొరియా కూడా భారీ నష్టాన్ని చవిచూసిందని పేర్కొంది. ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు ఉత్తర కొరియా నియంత కొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం అని కూడా తెలిపింది.

ఉత్తర కొరియా తన పోస్టులను పెంచుకుంది

రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్‌లను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉత్తర కొరియా సైనికులు మానిటరింగ్ పోస్ట్‌ల సంఖ్యను పెంచారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ యుద్ధంలో ఉత్తర కొరియా భారీ నష్టాన్ని చవిచూసింది. కిమ్ జోంగ్ ఉన్ సైన్యం యుద్ధ ప్రాంతంలో రెడ్ టేప్‌తో గుర్తించబడింది. రష్యా తన అధికారాన్ని కాపాడుకోవడానికి కుర్స్క్ ప్రాంతంలో ఉత్తర కొరియా సైన్యాన్ని మోహరించినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.

Also Read: Ayyannapatrudu: పెన్ష‌న్ల‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛ‌న్ బంద్!

ఉత్తర కొరియా సైనికులకు డ్రోన్లపై అవగాహన లేదు

రష్యాకు పంపిన 100 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, కనీసం 1,000 మంది గాయపడ్డారని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ గురువారం చట్టసభ సభ్యులకు తెలియజేసింది. సైనికుల మరణాలకు గల కారణానికి సంబంధించి, డ్రోన్ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలియని సైనికులను యుద్ధంలో ముందు వరుసలో ఉపయోగిస్తున్నారని చెప్పారు. మూలాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ సైన్యంలోని 11,000 మంది సైనికులు ఇప్పటికీ కుర్స్క్‌లో మోహరించారు.

 

  Last Updated: 20 Dec 2024, 10:00 AM IST