జోర్డాన్ నుండి లెబనాన్ రాజధాని బీరూట్కు బయలుదేరిన మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానంకు బుధవారం ల్యాండింగ్ సమయంలో అనుకోకుండా ఓ బుల్లెట్ తగిలింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సంబరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో బుల్లెట్ పేలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. MEA ఛైర్మన్ మొహమ్మద్ ఎల్ హౌట్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బీరూట్ విమానాశ్రయం పొరుగు ప్రాంతాల నుండి ఏడు నుండి ఎనిమిది నిశ్చల విమానాలు విచ్చలవిడి బుల్లెట్లకు గురవుతున్నాయి. అయితే బుధవారం నాటి ఘటన విమానం కదులుతున్న సమయంలో జరిగిన తొలి సంఘటన.
లెబనాన్ లో వేడుకలలో కాల్పులకు కొత్తేమీ కాదు. లెబనాన్లో తుపాకీని కలిగి ఉండటం సర్వసాధారణం. ఇటువంటి కాల్పులకు వ్యతిరేకంగా MEA ఛైర్మన్ హెచ్చరించారు. హౌట్ మాట్లాడుతూ.. “లెబనాన్లో గాలిలో కాల్పులు జరిపే ఈ పద్ధతులను తప్పనిసరిగా నిలిపివేయాలి. ఇది ఎయిర్ ట్రాఫిక్, విమానాశ్రయ ప్రమాదాలకి మూలం” అని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాద సమయంలో లెబనాన్ మంత్రి పౌలా యాకోబియన్ విమానంలో ఉన్నారు. బుల్లెట్ ఫ్యూజ్లేజ్కు తగిలిన తర్వాత విమానం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను సీటు 2Fలో కూర్చున్నానని ఆమె తెలిపింది. అనియంత్రిత ఆయుధాలు, విచ్చలవిడి బుల్లెట్లను అంతం చేయాలి అని ఆమె ట్వీట్ చేసింది.
بدل صباح الخير صار لازم نقول لبعض الحمدالله على السلامة #لبنان
السلاح المتفلت والرصاص الطايش لازم ينوضعلو حد
التفاصيل الليلة مع مرسال غانم الساعة ١٠ @mtvlebanon @sarelwa2et https://t.co/rPvcAnlMVI pic.twitter.com/s6nggvxpyl— بولا يعقوبيان (@PaulaYacoubian) November 10, 2022