ఖ‌మేనీ భార్య కూడా క‌న్నుమూత‌!

ఈ ఘటన ఇరాన్ రాజకీయ పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చింది. అక్కడ నాయకత్వ వారసుడి ఎంపికపై చర్చలు వేడెక్కాయి.

Published By: HashtagU Telugu Desk
Khamenei

Khamenei

Khamenei Wife: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే మరణించారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం.. ఇటీవల అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సుదీర్ఘ చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. ఈ దాడులు ఫిబ్రవరి 28న టెహ్రాన్‌తో సహా పలు కీలక ప్రాంతాలపై జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. 1989 నుండి ఇరాన్ అత్యున్నత మతపరమైన, రాజకీయ నాయకుడిగా ఉన్న ఖమేనీ మరణం ఇరాన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. మన్సూరే 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు పిల్లలు. ఆమె ఎప్పుడూ ప్రజా జీవితానికి దూరంగా ఉండేవారు. వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె కనిపించడం చాలా అరుదు. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా పేర్కొన్నప్పటికీ ఖమేనీ కుటుంబంలోని మిగిలిన సభ్యుల మరణంపై ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు.

Also Read: అంపైర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. వైర‌ల్ వీడియో ఇదే!

ఫిబ్రవరి 28న టెహ్రాన్, ఇతర కీలక ప్రాంతాలపై జరిగిన భారీ వైమానిక దాడులతో ఇరాన్‌పై దాడులు మొదలయ్యాయి. ఇందులో ఖమేనీ మరణాన్ని ఇరాన్ అధికారులు ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల్లో భాగంగా ఈ దాడులను పరిగణిస్తున్నారు. ఇక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా వివాదం పతాక స్థాయికి చేరుకుంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఈ సమయంలో బహిరంగ కార్యక్రమాలు, వేడుకలపై నిషేధం విధించారు.

ఈ ఘటన ఇరాన్ రాజకీయ పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చింది. అక్కడ నాయకత్వ వారసుడి ఎంపికపై చర్చలు వేడెక్కాయి. అంతర్జాతీయ సమాజం ఈ దాడిని ఖండిస్తుండగా ఇది స్పష్టమైన దురాక్రమణకు నిదర్శనమని పేర్కొంటూ ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతామని హెచ్చరించింది.

  Last Updated: 02 Mar 2026, 10:01 PM IST