Fact Check : ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ ఉగ్రవాది మసూద్ అజార్ బాంబుదాడిలో చనిపోయాడనే టాక్ ఇటీవల నడిచింది. బాంబుపేలుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పలు జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేయగా.. ఆ ప్రచారమంతా ఒట్టి అబద్ధమని తేలింది. బాంబు పేలుడు వీడియోలు ఇతరత్రా ఘటనలకు సంబంధించినవని.. వాటిని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్తో లింక్ చేసి అబద్ధపు ప్రచారం చేశారని వెల్లడైంది. బాంబుదాడిలో ఉగ్రవాది మసూద్ అజార్ హతమయ్యాడనే విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ ధ్రువీకరించే స్క్రీన్ షాట్లు కూడా నకిలీవే, కల్పితాలే అన్ని రూఢి అయింది.
We’re now on WhatsApp. Click to Join.
🚨 🇵🇰 Pakistan : Most wanted terrorist Maulana Masood Azhar reportedly killed in bomb explosion by Unknown Men, returning from Bhawalpur mosque. pic.twitter.com/Vgl3UikZgJ
— शून्य (@Shunyaa00) January 1, 2024
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ మర్డర్పై పాకిస్తాన్ జాతీయ మీడియాలో ఇటీవల ఎలాంటి వార్తలు కూడా రాలేదు. ఎందుకంటే అలాంటి ఘటనేదీ జరగలేదని వారికి తెలుసు. కానీ పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎప్పటిదో ఒక పాత వీడియోను తీసుకొచ్చి.. దానికి మసూద్ అజార్ మర్డర్ జరిగిందనే టెక్ట్స్ను రాసి పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో భారతీయ మీడియాలో దానిపై క్వశ్చన్ మార్క్తో కథనాలను వండి వార్చారు.
Pakistan🚨 Six people were killed and 25 injured in a blast targeting a police van in Dera Ismail Khan. Gunshots were also heard after the blast. pic.twitter.com/HdF5RWzxkh
— OSINT Updates (@OsintUpdates) November 3, 2023