Hamas attack on Israel: ఇజ్రాయెల్పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది .ఇజ్రాయెల్లోని భారతీయ పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మరియు భద్రతా ప్రోటోకాల్లను అనుసరించాలని భారతదేశం సలహా ఇస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం నోటీసులు జారీ చేసింది . “ ఇజ్రాయెల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశంలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు సూచించిన విధంగా భద్రతా ప్రోటోకాల్లను అనుసరించాలి. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ కోరింది. అదనపు సమాచారం కోసం ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్ చూడాలని సూచించింది. ఇజ్రాయెల్లోని భారతీయ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్ ఎంబసీ హెల్ప్లైన్ నంబర్ +97235226748 లేదా ఇమెయిల్: const.telaviv@mea.gov.in ని సంప్రదించవలసిందిగా అభ్యర్థించబడింది .కాగా హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్ పై దాడి చేయగా, గాజా నుంచి ఐదు వేల రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్లో వేల కొద్దీ ప్రజలు మరణించారు మరియు వందల మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. హమాస్పై యుద్ధం ప్రకటించింది. ఎదురుదాడిగా ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ను ప్రారంభించింది.
Also Read: Mangalavaram: అజయ్ భూపతి ‘మంగళవారం’లో రెండో పాట ‘ఏమయ్యిందో ఏమిటో’ విడుదల