India- Pakistan Ceasefire: రాజస్థాన్లోని బార్మర్, శ్రీనగర్, బర్నాలా, ముక్త్సర్లలో పూర్తి బ్లాక్ఆవుట్ అమలు చేయబడింది. బార్మర్లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక డ్రోన్లు కనిపించాయి. బర్నాలాలో అత్యవసర సైరన్లు మోగుతున్నాయి. గుజరాత్లోని కచ్లో 10 పాకిస్థానీ డ్రోన్లు కనిపించాయి. వీటిని భారత సైన్యం విఫలం చేసింది. అదే విధంగా శ్రీనగర్లో కూడా డ్రోన్లు కూల్చివేయబడ్డాయి.
యుద్ధ విరమణ (India- Pakistan Ceasefire) గురించి షెహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. కానీ ఆయన ఈ పోస్ట్ చేసే సమయానికి ఈ యుద్ధ విరమణ ఒప్పందం ఉల్లంఘించబడింది. ఆ ట్వీట్లో ఆయన ఇలా అన్నారు. మేము అధ్యక్షుడు ట్రంప్కు ప్రాంతీయ శాంతి కోసం ఆయన నాయకత్వం, చురుకైన పాత్రకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాన్ని సులభతరం చేసినందుకు పాకిస్థాన్.. యునైటెడ్ స్టేట్స్ను అభినందిస్తుంది. దీనిని మేము ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం స్వీకరించాము. దక్షిణాసియాలో శాంతి కోసం వారి విలువైన సహకారానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టిన సమస్యల పరిష్కారంలో శాంతి, సమృద్ధి, స్థిరత్వం వైపు దాని ప్రయాణాన్ని అడ్డుకున్న సమస్యల పరిష్కారంలో ఇది ఒక కొత్త ప్రారంభంగా పాకిస్థాన్ భావిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
Also Read: CBSE Board Result 2025: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు చెక్ చేసుకోండిలా!
కాల్పులు జరగడం లేదు
ఎల్ఓసీ వద్ద ఇప్పుడు ఎలాంటి కాల్పులు జరగడం లేదు. ఈ విషయాన్ని సైన్యం అధికారి ధృవీకరించారు. అంతేకాకుండా శ్రీనగర్లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని కూడా తెలిపారు. సైన్యం అధికారి మాట్లాడుతూ.. డ్రోన్లు వచ్చాయి కానీ వాటిలో చాలావరకు తిరిగి వెళ్లిపోయాయని చెప్పారు. ఉరీ, బారాముల్లా లేదా ఉత్తర కాశ్మీర్లో ఎలాంటి కాల్పులు, గోలీబారీ లేదా డ్రోన్లు కనిపించలేదని కూడా వారు వెల్లడించారు. జాగ్రత్త చర్యగా ఉత్తర కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో బ్లాక్ఆవుట్ అమలు చేశాం. అంతేకాకుండా అమృత్సర్లోని ఎయిర్ బేస్పై ఎలాంటి దాడి జరగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.