Site icon HashtagU Telugu

SpaceX Crew 8 : 233 రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు.. ఎలా అంటే ?

Spacex Crew 8 Astronauts Earth

SpaceX Crew 8 : ఇంటర్నేషనల్ స్పేస్​ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఏడు నెలలు(233 రోజులు) గడిపిన నాసా ‘స్పేస్‌ ఎక్స్’ డ్రాగన్ వ్యోమనౌక క్రూ-8 విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. ఫ్లోరిడాలోని పెన్సకోలా సముద్ర  తీరంలో వారు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ క్రూలో అమెరికా, రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. భూమిపైకి చేరుకున్న వెంటనే ఆస్ట్రోనాట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. స్పేస్​ ఎక్స్​ రికవరీ టీమ్స్ పెన్సకోలా సముద్ర  తీరంలో డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్​ను రికవరీ చేసి భద్రపరిచారు. ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు 200కుపైగా శాస్త్రీయ పరిశోధనలు చేశారు.

Also Read :Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ

Also Read :5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్