ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మొత్తానికి పూర్తయ్యింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. 44కోట్ల డాటర్లతో ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు మస్క్. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సీఎఫ్ ఓ తోపాటు పలు విభాగాలకు చెందిన అధిపతలుకు ఉద్వాసన పలికారు.
కాగా ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఏదొక నిర్ణయం తీసుకోవాలంటూ అక్టోబర్ 28 తుదిగడువుగా కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రక్రియను పూర్తి చేసే చర్యలను వేగవంతం చేశారు మస్క్. 13 బిలియన్ డాలర్ల రుణాలకోసం ఈ మధ్యే బ్యాంకర్లతోసమావేశం అయ్యారు. తాజాగా ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మస్క్ అక్కడ చర్యలు జరిపారు. ట్విట్టర్ కార్యాలయంలో అడుగుపెడుతున్న ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ ను చీప్ ట్విట్ గా మార్చుకున్నారు. తన లొకేషన్ పై కూడా ట్విటర్ ప్రధానంగా కార్యాలయంగా మార్చుకున్నారు మస్క్.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ఇదంతా ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఒక రోజు ముందు జరిగింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను వెల్లడించింది.
Elon Musk in charge of Twitter, begins purge of top executives
Read @ANI Story | https://t.co/tOlZqWQt2w#ElonMusk #Twitter #AcquisitionDeal pic.twitter.com/TFWxMQqSqT
— ANI Digital (@ani_digital) October 28, 2022