Site icon HashtagU Telugu

Donald Trump: సుంకాలపై భారత్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు?

Donald Trump, Modi

Donald Trump, Modi

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలపై చురుకుగా చర్చలు జరుపుతున్నారు. CNN తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ చర్చలు దగ్గరలో ఉన్న గడువు ముందు జరుగుతున్నాయి. ఒప్పందం కుదరకపోతే ఈ దేశాల నుండి దిగుమతులపై కొత్త సుంకాలు విధించబడతాయి.

CNN నివేదిక ప్రకారం.. ట్రంప్ ఈ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే ఏప్రిల్ 9 నుండి అమలులోకి వచ్చే సుంకాలపై నిషేధం విధించబడవచ్చు. భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో ట్రంప్ జరుపుతున్న ఈ వాణిజ్య ఒప్పంద చర్చలు ఇతర దేశాలతో ఇలాంటి చర్చలకు మార్గం సుగమం చేయవచ్చు.

చైనా, కెనడా ఇప్పటికే ట్రంప్ సుంకాల విధానానికి ప్రతిస్పందనగా అమెరికా దిగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామని ప్రకటించాయి. వైట్ హౌస్ ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ పరిపాలన విధించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 9 నుండి అమలులోకి వస్తాయి. అమెరికా అధ్యక్షుడి కుమారుడు ఎరిక్ ట్రంప్ Xలో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు. నేను డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపడానికి చివరి దేశంగా ఉండాలని అనుకోను. మొదట చర్చలు జరిపినవాడు గెలుస్తాడు. చివరిగా చర్చలు జరిపినవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. నా జీవితంలో ఈ సినిమాను పూర్తిగా చూశాన‌ని రాసుకొచ్చారు.

Also Read: Discounts: ఈ కారుపై రూ. 1.35 లక్షల డిస్కౌంట్.. డిమాండ్ మామూలుగా లేదు!

ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన వాణిజ్య భాగస్వాములతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించారు. గురువారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. “సుంకాల విషయంలో ప్రతి దేశం మాతో చర్చలు జరపాలని కోరుకుంటుందని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరస్పర సుంకాల విధానం కింద ఏప్రిల్ 2న భారతదేశం, వియత్నాం ,ఇజ్రాయెల్‌పై కొత్త సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 9 నుండి భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతులపై 26% సుంకం, వియత్నాంపై 46% సుంకం, ఇజ్రాయెల్‌పై 17% సుంకం విధించబడుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పరస్పర సుంకం సగం మాత్రమే విధించారు. ఎందుకంటే భారతదేశం అమెరికా ఎగుమతులపై 52% సుంకం విధిస్తుంది. భారతదేశంతో సుంకాల అంశంపై చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు.