Site icon HashtagU Telugu

China Build Largest Dam: భారత సరిహద్దులో 137 బిలియ‌న్ డాల‌ర్ల‌తో చైనా అతిపెద్ద డ్యామ్‌?

Tourist Visas

Tourist Visas

China Build Largest Dam: భారతదేశం- చైనా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. భారత సరిహద్దు దగ్గర చైనా అతిపెద్ద డ్యామ్‌ను (China Build Largest Dam) నిర్మిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 137 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చైనా ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు చర్చ జరుగుతోంది. డ్రాగన్ ఈ చర్య భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. చైనా ఈ ప్రాజెక్ట్ కింద టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్

హాంకాంగ్ నుండి ప్రచురించబడిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో చైనా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు పేర్కొంది. దీనికి సంబంధించి గురువారం ఓ వార్త ప్రచురితమైంది. ఈ డ్యామ్ ప్రాజెక్ట్‌లో ఒక ట్రిలియన్ యువాన్ లేదా 137 బిలియన్ యుఎస్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. ఈ డ్యామ్ నిర్మాణం జరిగితే చైనా తన పాత రికార్డును తానే బద్దలు కొట్టుకుంటుంది. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట అని మ‌న‌కు తెలిసిందే.

Also Read: Manmohan Singh : విమానంలో మన్మోహన్ ప్రెస్ మీట్..ఇది కదా స్టైల్ అంటే..!!

చైనా ప్లాన్‌ ఏమిటి?

ఈ ఆనకట్ట కట్టడం ద్వారా చైనా భారత్‌ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఇది భారతదేశానికి చాలా ఆందోళన కలిగించే విషయమని నిరూపించవచ్చు. కారణం ఏమిటంటే.. దాని నిర్మాణం తర్వాత బ్రహ్మపుత్ర నది నీటిపై చైనా తన నియంత్రణను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇరుదేశాల మధ్య ఎప్పుడైనా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తితే, ఈ నది నీటి ప్రవాహాన్ని చైనా తన సొంత మార్గంగా ఆపవచ్చు. కాలక్రమేణా నీటి ప్రవాహాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే ఈ డ్యామ్ కింద బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌పై తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించవచ్చు.

భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం

భారత సరిహద్దులో ఈ డ్యామ్ నిర్మాణం వెనుక అనేక ఉద్దేశాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఇది భారతదేశాన్ని చుట్టుముట్టడానికి పెద్ద ఎత్తుగడ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా నిరంతరం భారత్‌ను ఇరుకున పెడుతోంది. ఇది అరుణాచల్‌పై తన వాదనను కూడా నొక్కి చెబుతోంది. ఇటువంటి పరిస్థితిలో అరుణాచల్ సమీపంలో ఈ డ్యామ్ నిర్మాణం వ్యూహాత్మక కోణం నుండి భారతదేశానికి మంచి సంకేతం కాదని అంటున్నారు.