గత వారం సరస్సులో తప్పిపోయిన భారతదేశాని (India)కి చెందిన ఇద్దరు ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థుల (Indiana University Students) మృతదేహాలు శోధన తర్వాత అమెరికా (America)అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఇండియానా పోలీస్ డౌన్టౌన్కు నైరుతి దిశలో 64 మైళ్ల దూరంలో ఉన్న లేక్ మన్రోలో ఏప్రిల్ 15న సిద్ధాంత్ షా (19), ఆర్యన్ వైద్య (20) స్నేహితుల బృందంతో ఈతకు వెళ్లారని ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 18న పేన్టౌన్ మెరీనాకు తూర్పున 18 అడుగుల నీటిలో మృతదేహాలను సెర్చ్ సిబ్బంది గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
10,750 ఎకరాలు, 35-40 అడుగుల లోతున్న ఈ సరస్సులో ఈత కొట్టేందుకు వారి బృందం లంగరు వేసినప్పుడు ఇద్దరు పాంటూన్పై బోటింగ్ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు తిరిగి రాకపోవడంతో స్నేహితులు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారని ఆ ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ ఏంజెలా గోల్డ్మన్ USA టుడేతో మాట్లాడుతూ.. ఒక వ్యక్తి మునిగిపోతున్నాడని, అతనికి సహాయం చేయడానికి ఇతరులు దూకారని చెప్పారు.
Also Read: Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!
రక్షకులు సోనార్, స్కూబా డైవర్లను ఉపయోగించి సరస్సును శోధించడం ప్రారంభించారు. కానీ గాలులతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా మొదటి రోజు కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చింది. గంటకు 15 నుండి 20 మైళ్ల వేగంతో గాలులు వీయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గోల్డ్మన్ US TODAYకి తెలిపారు. ఇండియానా యూనివర్శిటీ స్టూడెంట్ సర్వీసెస్ గ్రూప్లోని మిగిలిన వారిని తిరిగి క్యాంపస్కు పంపించారు. అక్కడ వారికి కౌన్సెలింగ్ సేవలు అందించారు.