Australia: ఆస్ట్రేలియాలో లక్షల్లో చేపల మృత్యువాత.. వీడియో వైరల్..!

ఆస్ట్రేలియా (Australia)లోని ఓ నదిలో లక్షలాది చేపలు చచ్చిపోయాయి. చనిపోయిన, కుళ్లిన చేపల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నది గురించి చెబుతోంది.

Published By: HashtagU Telugu Desk
Australia

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ఆస్ట్రేలియా (Australia)లోని ఓ నదిలో లక్షలాది చేపలు చచ్చిపోయాయి. చనిపోయిన, కుళ్లిన చేపల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నది గురించి చెబుతోంది. చేపలు చచ్చిపోవడంతో నది అంతా తెల్లగా కనపడే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో మండుతున్న ఎండలే ఈ చేపలు చనిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. చనిపోయిన చేపల కారణంగా నది ఉపరితలం చాలా తక్కువగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ పిక్చర్‌లో చూడవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి న్యూ సౌత్ వేల్స్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతూ.. చిన్న పట్టణమైన మెనిండీ సమీపంలోని డార్లింగ్ నదిలో లక్షలాది చేపలు చనిపోయాయి. 2018 నుంచి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడం ఇది మూడో ఘటన.

గతంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. నది కనిపించేంత వరకు చనిపోయిన చేపలు మాత్రమే కనిపిస్తున్నాయని మెనిండీ నివాసి గ్రేమ్ మెక్‌క్రాబ్ చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి లెక్కలేనన్ని చేపలు చనిపోయాయి. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఇటీవలి సంవత్సరాలలో మా ప్రాంతం కరువు, వరదల నుండి వినాశనాన్ని ఎదుర్కొంటోందని అన్నారు.

Also Read: Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిపుణులతో పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వరదల తర్వాత నదిలో బోనీ హెర్రింగ్, కార్ప్ వంటి చేపల సంఖ్య వేగంగా పెరిగిందని, అయితే ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అవి పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. వరద నీరు తగ్గిన తర్వాత నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడమే ఈ చేపలు చనిపోవడానికి కారణమని అంటున్నారు. వేడి ఉష్ణోగ్రతల వద్ద చేపలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరమని తెలిసిందే.

  Last Updated: 19 Mar 2023, 08:24 AM IST