Mexico: సెంట్రల్ మెక్సికోలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి

సెంట్రల్ మెక్సికో (Mexico)లో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలోని వాటర్ పార్క్ (Water Park) వద్ద కొందరు దుండగులు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గరు పురుషులు, ఏడేళ్ల మైనర్ మృతిచెందారు.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 09:16 AM IST

సెంట్రల్ మెక్సికో (Mexico)లో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలోని వాటర్ పార్క్ (Water Park) వద్ద కొందరు దుండగులు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గరు పురుషులు, ఏడేళ్ల మైనర్ మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సెంట్రల్ మెక్సికోలో ఓ రిసార్ట్‌పై ముష్కరుల బృందం దాడి చేసి కాల్పులు జరిపి ఆరుగురు పెద్దలు, 7 ఏళ్ల బాలుడిని చంపినట్లు అధికారులు తెలిపారు.

లా పాల్మా రిసార్ట్‌లో జరిగిన దాడిలో మరో వ్యక్తి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని గ్వానాజువాటో రాష్ట్రంలోని కోర్టజార్ మునిసిపాలిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల అనంతరం దుండగులు స్పా దుకాణాన్ని ధ్వంసం చేసి పారిపోయే ముందు సెక్యూరిటీ కెమెరాలను తీసుకున్నారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ఒక వీడియోలో స్విమ్‌సూట్‌లలో చాలా మంది తమ పిల్లలను ఏడుస్తూ, అరుస్తూ, కౌగిలించుకుంటూ పరుగెత్తుతున్నట్లు చూపించారు.

Also Read: Mobile Tower Stolen: బీహార్‌లో సెల్ టవర్‌ చోరీ.. పట్టపగలే దొంగతనం.. చోరీ ఎలా చేశారో తెలుసా..?

మెక్సికన్ సైనికులు, పోలీసులు హెలికాప్టర్ సహాయంతో దాడి చేసినవారి కోసం వెతుకుతున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రమైన గ్వానాజువాటో మెక్సికోలో సంవత్సరాల తరబడి అత్యంత హింసాత్మక రాష్ట్రంగా ఉంది. పారిశ్రామిక హబ్‌గా పేరొందిన గ్వానాజువాటోలో తరచూ గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. గతంలో ఇరుపుటో సిటీలోని బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించగా గతేడాది సెప్టెంబర్‌లో అదే ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.