Khamenei: అమెరికా- ఇజ్రాయెల్లతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మృతదేహాన్ని ఇరాన్లోని అత్యంత పవిత్ర నగరాలలో ఒకటైన ‘మషద్’లో ఖననం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇరాన్ సెమీ-అఫీషియల్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ.. ఈశాన్య ఇరాన్లోని ఈ నగరంలోనే ఆయనను ఖననం చేయనున్నట్లు ఏఎఫ్పీ నివేదించింది. విశేషమేమిటంటే ఖమేనీ తండ్రిని కూడా ఇదే మషద్ నగరంలోని ఇమామ్ రజా పవిత్ర దర్గా లోపల ఖననం చేశారు.
Also Read: Ration Rice : రేషన్ దారులకు గుడ్ న్యూస్..ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి
86 ఏళ్ల వయసులో మరణం
36 ఏళ్ల పాటు ఇరాన్ను నడిపించిన ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో 86 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ఫారమ్లో ప్రకటించారు. దీనిని ఇరాన్ పాలన తర్వాత అధికారికంగా ధృవీకరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) టెహ్రాన్లో భారీ వీడ్కోలు వేడుక నిర్వహించనున్నట్లు తమ టెలిగ్రామ్ ఛానల్లో వెల్లడించింది.
అంతిమ వీడ్కోలు కార్యక్రమాలు
టెహ్రాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇరాన్ సమయం ప్రకారం నేడు రాత్రి 10 గంటల నుండి ఖమేనీ మృతదేహానికి అంతిమ వీడ్కోలు మొదలవుతుంది. ఇమామ్ ఖొమేనీ మసీదులో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయనను ఖననం చేసే పూర్తి కార్యక్రమంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అత్యధిక కాలం సుప్రీం లీడర్గా ఉన్న రెండో వ్యక్తి ఖమేనీ. రక్షణ, ఆర్థిక వ్యవస్థ, విద్య వంటి కీలక విషయాల్లో ఆయన తుది నిర్ణయం తీసుకునేవారు.
షియా ఇస్లాం ప్రధాన తీర్థయాత్రా కేంద్రం
ఇరాన్లో రెండో అతిపెద్ద నగరమైన మషద్. షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ ఇమామ్ రజా దర్గా ఉంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ రాజకీయ వ్యవస్థపై గట్టి పట్టు సాధించి, మధ్య ప్రాచ్యంలో దేశ ప్రభావాన్ని పెంచిన ఖమేనీ వారసత్వం, ఈ ప్రాంత భూ-రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
