Site icon HashtagU Telugu

Adani To Vietnam: వియ‌త్నాంపై గౌత‌మ్ అదానీ చూపు.. అస‌లు క‌థ ఏంటంటే..?

Adani Group In TIME

Adani Group In TIME

Adani To Vietnam: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రతి రంగంలో తన బలమైన ఉనికిని నమోదు చేస్తోంది. ఇప్పుడు అదానీ గ్రూప్ తన గ్లోబల్ రీచ్‌ను పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదానీ పోర్ట్స్ ప్రపంచంలోని అనేక దేశాల్లో పోర్ట్‌లను నిర్వహించే అవకాశాలను అన్వేషిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను పెంచుకోవడానికి అదానీ గ్రూప్ త్వరలో వియత్నాం (Adani To Vietnam)లో ఓడరేవును నిర్మించే అవ‌కాశం ఉంది. ఇది నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయం అవుతుంది. ఇంతకుముందు కంపెనీ ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లో ఓడరేవులను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం ఆమోదం

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వియత్నాంలో నిర్మించబోయే ఓడరేవు భారతదేశం చుట్టూ వాణిజ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్‌కు సహాయం చేస్తుంది. ఇది కాకుండా కంపెనీకి కొత్త అవకాశాలు కూడా సృష్టించ‌నుంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ కంపెనీ. కంపెనీ MD, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుండి అనుమతి పొందినట్లు చెప్పారు.

Also Read: Watch Gifts: అనంత్‌- రాధికాల పెళ్లికి హాజ‌రైన వారికి కోట్లు విలువ చేసే వాచీలు.. ఫీచ‌ర్లు ఇవే..!

అంతర్జాతీయ కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు సన్నాహాలు

భారతదేశాన్ని సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా మార్చాలనుకుంటున్నామని కరణ్ అదానీ అన్నారు. తయారీ, జనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు చేరువ కావాలని మేము కోరుకుంటున్నామ‌న్నారు. ఈ దేశాల నుంచి ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నామ‌న్నారు. ప్రస్తుతం వియత్నాంలో ఓడరేవు నిర్మాణానికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా అంచనా వేయలేం. నివేదిక ప్రకారం.. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం దాని మొత్తం వాణిజ్యంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుండి పొందుతుంది. 2030 నాటికి ఈ సంఖ్యను 10 శాతానికి తీసుకురావాల‌ని యోచిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కేరళలోని విజింజం ఓడరేవు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు

ప్రస్తుతం కంపెనీ కేరళలోని విజింజం పోర్ట్‌లో పనిచేస్తోందని కరణ్ అదానీ చెప్పారు. దీని మొదటి దశ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఈ నౌకాశ్రయంలో అదానీ గ్రూప్, కేరళ ప్రభుత్వం రూ.20,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. 2028-29 నాటికి ఈ పోర్టు పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ 2018లో ప్రారంభం కావాల్సి ఉండగా భూమిని పొందడంలో జాప్యం కారణంగా ఆలస్యమైంది. ఈ నౌకాశ్రయం సహాయంతో దుబాయ్, సింగపూర్, శ్రీలంకలకు స‌ముద్ర మార్గం భారత్‌కు తోడ్పడనుంది.