Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..!!

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 08:24 PM IST

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రాజధాని జకార్తాలో ఇవాళ సాయంత్రం సంభవించిన ఈ భారీ భూకంపం రిక్టర్ స్కెల్ పై 6.6గా నమోదు అయ్యింది. దీంతో ప్రజలు ఇళ్లను బయటకు పరుగులు తీశారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:07గంటలకు సంభవించింది. ఈ భూకంప లోతు 20కిలోమీటర్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఆస్తినష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సునామీ హెచ్చరికలను జారీ చేశారు.