Pakistan Rains 2024: భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. ఈ ధాటికి 71 మంది మరణించగా, 67 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారి మాట్లాడుతూ వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో పైకప్పు కూలిపోవడం మరియు పిడుగుపాటు సంఘటనలతో సహా వివిధ సంఘటనలలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఖైబర్ పఖ్తున్ఖ్వాలో మరణించిన వారిలో 15 మంది పిల్లలు మరియు ఐదుగురు మహిళలు ఉన్నారు, ఇందులో 41 మంది గాయపడ్డారు మరియు 1,370 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 23 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారని, నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఎనిమిది మంది మరణించారని, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో సహాయక సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 29 వరకు దేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్డిఎంఎ తెలిపింది.
Also Read: Kamal R Khan : సినిమాలు ఫ్లాప్ అన్నందుకు నా మీద 10 కేసులు పెట్టారు.. నటుడు సంచలన ట్వీట్..