55 Sailors Dead : ‘సముద్ర ఉచ్చు’కు 55 మంది చైనా సబ్‌మెరైనర్ల మృతి.. ఏం జరిగింది ?

55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 12:49 PM IST

55 Sailors Dead : శత్రు దేశాల నౌకలను, జలాంతర్గాముల (సబ్ మెరైన్)ను అడ్డుకోవడానికి చైనా అమర్చిన చైన్ అండ్ యాంకర్ ట్రాప్ (ఉచ్చు) పెను ప్రమాదానికి కారణమైంది. ఆ ఉచ్చులో చిక్కుకొని చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’లోని మొత్తం 55 మంది  సిబ్బంది బలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 21న ఉదయం 8:12 గంటలకు చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో ఈ ప్రమాదం జరిగిందని బ్రిటన్ ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై బ్రిటన్ మీడియాలో సంచలన కథనాలు పబ్లిష్ అయ్యాయి. అయితే ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ జరగలేదని తేల్చి చెప్పింది.  బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. చైనా సబ్ మెరైన్ సముద్రం లోపల ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత.. దాని సిస్టం ఫెయిలైంది. ఆ సబ్ మెరైన్ కు మరమ్మతులు చేసి ఉపరితలానికి తీసుకురావడానికి దాదాపు  6 గంటల టైం పట్టింది. అప్పటికే సబ్ మెరైన్ లోని ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, ఎయిర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలు పనిచేయడం ఆపేశాయి.  ఆక్సీజన్ సరఫరా వ్యవస్థ స్తంభించడంతో.. దానిలోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు చనిపోయారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రమాదంపై  చైనా నోరు మెదపకపోవడంతో ఆ న్యూక్లియర్ సబ్ మెరైన్ నుంచి ఏవైనా అణు పదార్థాలు సముద్రంలోకి లీకయ్యాయా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి  ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్‌ సబ్‌మెరైనర్లు ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే చైనాకు చెందిన క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ఉంది. అక్కడికి అమెరికా, బ్రిటన్‌ జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో చైనా ఈ ట్రాప్ ను ఏర్పాటు చేసింది. దానికి చైనాకే చెందిన న్యూక్లియర్ సబ్ మెరైన్ ‘093-417’ చిక్కడంతో ఈ విషాద ఘటన సంభవించింది.

Also read : TDP : వారాహిలో అల్లర్లు సృష్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.. వైసీపీకి టీడీపీ నేత య‌ర‌ప‌తినేని హెచ్చరిక‌

ఈ ప్రమాదం జరిగిన రోజునే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం నుంచి హఠాత్తుగా వైదొలిగారు. ఈ క్రమంలో చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌ వాక్వింగ్‌ అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని సదస్సుకు చదివి వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సబ్‌మెరైన్‌ ప్రమాద వివరాలు తెలియడంతోనే (55 Sailors Dead)  జిన్‌పింగ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు.