China Jiangxi Fire: చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి

తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 39 మంది మరణించారు . జిన్యులోని యుషుయ్ జిల్లాలోని వీధి దుకాణం నుండి మధ్యాహ్నం 3 గంటలకు మంటలు చెలరేగాయి.

China Jiangxi Fire: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 39 మంది మరణించారు . జిన్యులోని యుషుయ్ జిల్లాలోని వీధి దుకాణం నుండి మధ్యాహ్నం 3 గంటలకు మంటలు చెలరేగాయి. 120 రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై చైనా అధ్యక్షుడు స్పందించారు. ప్రమాదాలు పదే పదే జరగకుండా చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని స్థానిక ప్రభుత్వం తెలిపింది.

చైనాలో జరిగిన ప్రమాద ఘటనలో 39 మంది మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు, మరికొందరు ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకున్నారని నివేదిక తెలిపింది. మంటలు చెలరేగిన భవనంలో ఇంటర్నెట్ కేఫ్‌లు మరియు శిక్షణా సంస్థలు ఉన్నాయని సెంట్రల్ చైనా టెలివిజన్ నివేదించింది.దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భవనం నుండి దట్టమైన చీకటి పొగలు వ్యాపించాయి

జనవరి 20న సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది విద్యార్థులు మరణించారు. మృతులంతా మూడో తరగతి చదువుతున్న విద్యార్థులు. గత ఏడాది నవంబర్‌లో షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ నగరంలో ఒక కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 26 మంది మరణించారు. గత ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Egg Mutton Biryani: ఎగ్ మటన్ బిర్యానిని ఇలా చేస్తే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం?