ట్యునీషియా (Tunisia Boat Accident)తీరంలో భారీ ప్రమాదం జరిగింది. తీరంలో పడవ బోల్తా పడడంతో కనీసం 28 మంది వలసదారులు మరణించారు. 60 మందికి పైగా గల్లంతయ్యారు. ఇటలీ అధికారులను ఉటంకిస్తూ, ఈ వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని CNN నివేదించింది.
48 గంటల్లో 58 బోట్లు ప్రమాదం:
ప్రమాదం గురించి ఇటాలియన్ కోస్ట్ గార్డ్ సమాచారం ఇస్తూ, గత 48 గంటల్లో 58 బోట్ల నుండి 3300 మందిని రక్షించినట్లు చెప్పారు. ట్యునీషియా నుండి ఆఫ్రికాకు అత్యంత సమీపంలోని ఇటాలియన్ ద్వీపం లాంపెడుసాకు వెళ్తున్న పడవల్లో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్యునీషియా అధికారులు పత్రాలు లేని సబ్-సహారా ఆఫ్రికన్లను అరెస్టు చేసిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
19 మంది మహిళలు, 9 మంది మైనర్లను రక్షించారు:
శనివారం, 19 మంది మహిళలు, 9 మంది మైనర్లను సముద్రం నుండి ట్యునీషియా ఫిషింగ్ బోట్ ద్వారా లాంపెడుసాకు తీసుకువచ్చినట్లు CNN నివేదించింది . అక్రమ వలసలను నివారించడానికి ట్యునీషియా ఫిషింగ్ బోట్ తనిఖీలు చేపడుతోంది. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో పేదరికం ఎదుర్కొంటున్న ప్రజలకు ట్యునీషియా ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. లిబియా నుంచి చాలా మంది ట్యునీషియాకు వలస వస్తున్నారు. ఈ వారం లాంపెడుసా నుండి చాలా మంది ప్రజలు ట్యునీషియా నుండి పడవలలో వచ్చినట్లు గుర్తించారు.
UN డేటా ప్రకారం, ఈ ఏడాది కనీసం 12,000 మంది వలసదారులు ట్యునీషియా నుండి ఇటలీకి వచ్చినట్లు వెల్లడించింది, 2022లో 1,300 మంది వలస వచ్చినట్లు గుర్తించారు. ట్యునీషియా ఫోరమ్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ గణాంకాల ప్రకారం, 2022లో అదే కాలంలో 2,900 మందితో పోలిస్తే, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 14,000 మంది వలసదారులను ట్యునీషియా కోస్ట్ గార్డ్ బోట్లను అడ్డుకున్నట్లు పేర్కొంది.
Bodies of 10 people recovered off Tunisia coast after migrant boat sinks https://t.co/OUbCbmefWo
— Sky News (@SkyNews) March 26, 2023