22 Terrorists: 22 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?

ఇరాక్‌లోని పశ్చిమ ప్రావిన్స్‌లోని అన్బర్‌లో జరిగిన ఆపరేషన్‌లో కొంతమంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు సహా మొత్తం 22 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (22 Terrorists) హతమైనట్లు ఇరాక్ మిలిటరీ తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
22 ISIS Terrorists

Resizeimagesize (1280 X 720) (1)

ఇరాక్‌లోని పశ్చిమ ప్రావిన్స్‌లోని అన్బర్‌లో జరిగిన ఆపరేషన్‌లో కొంతమంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు సహా మొత్తం 22 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (22 Terrorists) హతమైనట్లు ఇరాక్ మిలిటరీ తెలిపింది. ఆదివారం ఇరాక్ కౌంటర్ టెర్రరిజం సర్వీస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-సాదీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరిగిందని, ఐదుగురు భద్రతా నాయకులకు మాత్రమే దాని గురించి తెలుసునని, ఐసిటిఎస్, ఇరాక్ ఇంటెలిజెన్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు.

వాస్తవానికి.. రుత్బా నగరానికి ఉత్తరాన ఉన్న కఠినమైన భూభాగంలో వైమానిక దళం రెండు దశల్లో ఆపరేషన్ నిర్వహించిందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇది ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మేరకు వార్తా సంస్థ జిన్హువా ఒక నివేదికను అందజేసింది. చనిపోయిన ఉగ్రవాదులందరూ పేలుడు బెల్టులు ధరించి ఉన్నారని చెప్పారు. దీంతో పాటు చనిపోయిన వారిలో సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

Also Read: Mumbai Slums: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 800 గుడిసెలు దగ్ధం

గత నెలల్లో ఇరాక్ భద్రతా దళాలు, తీవ్రవాదులకు వ్యతిరేకంగా వారి తీవ్రమైన కార్యకలాపాలను అణిచివేసేందుకు చర్యలు ప్రారంభించాయి. 2017లో ఐఎస్‌ను ఓడించినప్పటి నుంచి ఇరాక్‌లో శాంతిభద్రతలు మెరుగవుతున్నాయి. అయినప్పటికీ, దాని అవశేషాలు అప్పటి నుండి పట్టణ కేంద్రాలు, ఎడారులు, కఠినమైన భూభాగాలలోకి మారాయి. భద్రతా దళాలు, పౌరులకు వ్యతిరేకంగా తరచుగా గెరిల్లా దాడులను కొనసాగిస్తున్నాయి.

 

  Last Updated: 14 Mar 2023, 06:54 AM IST