Peshawar Blast: పాకిస్థాన్లోని పెషావర్లోని బోర్డ్ బజార్ రోడ్డులో ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరికి గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ కషీఫ్ అఫ్తాబ్ అబ్బాసీ మాట్లాడుతూ బాంబు పేలుడు ఆత్మాహుతి కాదని తెలిపారు. ఇదిలావుండగా ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని, ఖైబర్ టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
పేలుడు జరిగిన ప్రదేశంలో భారీ పోలీసు బందోబస్తుతో పాటు SSP అధికారులు మోహరించారు. మరోవైపు సాక్ష్యాలను సేకరించడానికి ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) మరియు రెస్క్యూ టీమ్ల అధికారులు కూడా ఉన్నారు. ఘటనపై విచారణ జరుగుతుండగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. బోర్డ్ బజార్ పెషావర్లో రద్దీగా ఉండే రహదారి. ఇక్కడ సాధారణంగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. అయితే పేలుడు సంభవించిన సమయంలో ట్రాఫిక్ లేకపోవడంతో మరణాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు.
Also Read: Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్..?