Guru Purnima: గురు పూర్ణిమ (Guru Purnima) సందర్భంగా టెక్సాస్లోని అలెన్ ఈస్ట్ సెంటర్లో నాలుగు నుండి 84 సంవత్సరాల వయస్సు గల 10,000 మంది వ్యక్తులు భగవద్గీత పఠించడానికి సమావేశమయ్యారు. యోగా సంగీత, ఎస్జిఎస్ గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ యాగం నిర్వహించారు. మైసూర్లోని అవధూత్ దత్త పీఠం ఆశ్రమం నుండి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సన్యాసి పూజ్య గణపతి సచ్చిదానంద్ జీ సమక్షంలో భగవద్గీత పారాయణం జరిగింది. అవధూత్ దత్త పీఠం అనేది 1966లో శ్రీ గణపతి సచ్చిదానంద జీ స్వామీజీచే స్థాపించబడిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంక్షేమ సంస్థ.
శ్రీ స్వామీజీ విశ్వవ్యాప్త దృష్టి, మానవాళి ఉద్ధరణ పట్ల ప్రగాఢమైన కరుణ పీఠం మానవ జీవితాన్ని సుసంపన్నం చేయడానికి వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు, ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రేరేపించింది. టెక్సాస్లో భగవద్గీతను పఠించిన మొత్తం 10,000 మంది తమ గురువు గణపతి సచ్చిదానంద జీ స్వామి మార్గదర్శకత్వంలో గత ఎనిమిది సంవత్సరాలుగా దానిని కంఠస్థం చేసుకున్నారు.
Also Read: Osmania Hospital: తమిళిసై డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం, ఉస్మానియాకు కొత్త బిల్డింగ్!
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML
— ANI (@ANI) July 3, 2023
స్వామీజీ అమెరికాలో భగవద్గీత పఠన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. స్వామీజీ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హిందూ ఆధ్యాత్మికతను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. పూజ్య గణపతి సచ్చిదానంద జీ స్వామి జీ భగవద్గీతను ప్రబోధించడంలో, సనాతన హిందూ ధర్మ విలువలను వ్యాప్తి చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాధువు.