Kabul Attack:కాబూల్ ఆత్మాహుతి దాడికి 100 మంది చిన్నారుల బ‌లి

ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లోని పాఠశాలపై జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది పైగా విద్యార్థులు మరణించారు. ఈ సంఘటనలో మ‌ర‌ణించిన విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 03:36 PM IST

ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లోని పాఠశాలపై జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది పైగా విద్యార్థులు మరణించారు. ఈ సంఘటనలో మ‌ర‌ణించిన విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు. స్థానిక జర్నలిస్ట్ బిలాల్ సర్వారీ ట్వీట్ చేస్తూ “మేము ఇప్పటివరకు మా విద్యార్థుల 100 మృతదేహాలను లెక్కించాము. మరణించిన విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. తరగతి గది నిండిపోయింది.“ అంటూ ఆందోళ‌న చెందారు.

పేలుడుకు ముందు విద్యార్థుల తరగతిని లక్ష్యంగా చేసుకున్న వీడియో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో కూడా షేర్ చేయబడింది. పశ్చిమ కాబూల్‌లోని దష్టే బార్చే ప్రాంతం ISKP దాడులకు లక్ష్యంగా ఉంది. హజారాలు మరియు షియాలు తమ తరగతి గదుల్లోనే హత్య చేయబడ్డారు, ఆ జ‌ర్న‌లిస్ట్‌ ట్వీట్ చేశారు.

విద్యా కేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. దురదృష్టవశాత్తు, 19 మంది మ‌ర‌ణించ‌గా, 27 మంది గాయపడ్డారు” అని పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. “కాజ్” అనే విద్యా కేంద్రంపై దాడి జరిగింద‌ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ ట్వీట్ చేశారు.

భద్రతా బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. పౌర లక్ష్యాలపై దాడి చేయడం శత్రువు అమానవీయ క్రూరత్వాన్ని నైతిక ప్రమాణాల లోపాన్ని రుజువు చేస్తుంది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలు, స్థానిక మీడియా ప్రచురించిన ఫోటోలను గ‌మ‌నిస్తే రక్తసిక్తమైన బాధితులను సంఘటనా స్థలం నుండి తీసుకువెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.