YouTuber: రైల్వేట్రాక్ పై యూట్యూబర్ టపాసులతో విన్యాసాలు

సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఆశతో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఓ యూట్యూబర్ రైలు పట్టాల మధ్యలో పటాకులు కాల్చాడు

YouTuber: సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఆశతో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఓ యూట్యూబర్ రైలు పట్టాల మధ్యలో పటాకులు కాల్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన రైల్వేశాఖ ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న వ్యక్తి ఫులేరా-అజ్మీర్ దంత్రా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌ మధ్య ఉన్న సిమెంట్ దిమ్మెపై పాము క్రాకర్స్ ని కాల్చాడు. దీంతో మంటలు, పొగలు దట్టంగా వ్యాపించాయి. ఆ సమయంలో మరో ట్రాక్‌పై పెట్రోల్‌ ట్యాంక్‌లతో కూడిన గూడ్స్‌ రైలు వెళ్లింది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ట్రైన్స్ ఆఫ్ ఇండియా యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై చర్యలు తీసుకోండి’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో క్లిప్‌పై జైపూర్‌లోని నార్త్ వెస్ట్రన్ రైల్వే డివిజనల్ మేనేజర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) స్పందించారు. ఈ విషయంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పందించారు.

Also Read: Turkey: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నందుకు టర్కీలో కోకాకోలా, నెస్లే నిషేధం