Chhattisgarh: మండపంలో పెళ్ళికొడుకుపై యాసిడ్ దాడి చేసిన మాజీ ప్రియురాలు.. అసలేం జరిగిందంటే?

తాజాగా ఛత్తీస్గడ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ మండపంలో మాజీ ప్రియురాలు పెళ్ళికొడుకు

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 06:58 PM IST

తాజాగా ఛత్తీస్గడ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ మండపంలో మాజీ ప్రియురాలు పెళ్ళికొడుకు అలాగే అతని బంధువులపై యాసిడ్ దాడి చేసింది. అసలు ఏం జరిగిందంటే.. చత్తీస్గడ్ బస్తర్ జిల్లాలోని ఖాన్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో దముదర్ బాగేల్ అనే 25 ఏళ్ళ యువకుడికి 19 ఏళ్ల యువతతో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 19వ తేదీన వీరి పెళ్లి ముహూర్తాన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. మరి కొద్ది సేపట్లో పెళ్లి జరగబోతోంది అనగా ఇంతలో 22 ఏళ్ల యువతీ చేతిలో యాసిడ్ పట్టుకొని నేరుగా వరుడు దగ్గరికి వచ్చింది. వెంటనే తనతో తెచ్చుకున్న యాసిడ్ ను అతనిపై పోసింది.

కోపంలో వధువుపై కూడా పోసింది. మండపంలో ఆమెను పోవాలి అని చూసిన వారిపై కూడా యాసిడ్ పోయడంతో వారందరికీ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆ యువతి అక్కడి నుంచి పరారయింది. ఆ ఘటన సాయంత్రం వేళ జరిగింది అందులోనూ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో యాసిడ్ దానికి పాల్పడిన నిందితులు ఎవరు అన్నది గమనించలేకపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా వరుడుపై మాజీ ప్రియురాలు ఈ దారుణానికి ఒడిగట్టిందని తేల్చారు. దాంతో ఆమెను అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 326 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పోలీసులు స్పందిస్తూ..

గ్రామంలో ఉన్న కొన్ని సిసి టీవీ కెమెరాల ఆధారంగా చూసినా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిందితుడిని గమనించలేకపోయామని, విచారణలో భాగంగా వరుడు మాజీ ప్రేయసి ప్రమేయం ఉన్నట్లు వెల్లడి కావడంతో ఆమెను విచారించగా ఆమె అసలు నిజం ఒప్పుకుంది అని పోలీసులు వెల్లడించారు. తనను ప్రేమించి మరొక మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడని అలాంటివి దారుణానికి ఒడికట్టినట్లు నిందితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.