Rajastan: సీమా హైదర్ ఫాలో అయినా మరో మహిళ.. ప్రియుడు కోసం ఏకంగా అలాంటి పని?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ ప్రేమ వివాహారాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే చాలామంది పెళ్లయిన స్త్రీలు ప్రియ

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 04:30 PM IST

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ ప్రేమ వివాహారాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే చాలామంది పెళ్లయిన స్త్రీలు ప్రియుడి కోసం ఇతర దేశాలకు వెళ్లడంతో పాటు భర్త పిల్లలను కాదనుకుని మరి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సంఘటనలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పేరు సీమా హైదర్. చాలామంది స్త్రీలు ఈ మధ్యకాలంలో ఏమి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆమెను చూసి మరొకరు నేర్చుకుని అలాంటి పనులే చేస్తున్నారు. తాజాగా ఒక మహిళ కూడా అలాంటి పని చేసింది.

రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్‌ జిల్లాకు చెందిన దీపిక తన భర్త, పిల్లలను వదిలేసి తన ప్రియునితో విదేశాలకు వెళ్లిపోయిందట. ఈ విషయమై ఇటీవలే దీపిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పోలీసులకు ఆమె ఆచూకీ తెలియలేదు. స్థానికులు ఈ వ్యవహారాన్ని లవ్‌ జిహాద్‌ అని చెబుతున్నారు. కాగా ఈ ఘటన డూంగర్‌పూర్‌ జిల్లాలోని భౌమయీ గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తమ ఇంటిలో చెప్పకుండా జూలై 10న మరో వర్గానికి చెందిన యువకునితో విదేశాలకు వెళ్లిపోయింది. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు 11 ఏళ్లు, మరొక కుమార్తెకు 7 ఏళ్లు. భార్య ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయం కావడంతో భర్త చిత్రీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్థానికులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు ప్రస్తుతం ఆ మహిళను వెతికే పనిలో పడ్డారు.