`స్మార్ట్ ఫోన్` (Samartphones Ban)ఉంటే ఆ రెస్టారెంట్ (Restaurant) లో అడుగు పెట్టనివ్వరు. రెస్టారెంట్ లోపలకు వెళ్లాలంటే స్మార్ట్ ఫోన్ ఎంట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందే. లేదంటే, అనుమతి ఇవ్వరు. భోజనం నాణ్యత, రుచి తెలియాలంటే ఇలాంటి కఠిన నిర్ణయం తప్పదని ఆ రెస్టారెంట్ యజమాని భావించారు. అంతటి సాహసం మన దేశంలో కాదులెండీ. జపాన్ లోని టోక్యోలో ఉన్న రామెన్ రెస్టారెంట్ సమీపంలోని డెబు-చాన్ ఆ సాహసం చేసిందంట.
స్మార్ట్ ఫోన్` ఉంటే ఆ రెస్టారెంట్ లో అడుగు పెట్టనివ్వరు(Samartphones Ban)
నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి, భోజనం నాణ్యతను ఆస్వాదించడానికి జపనీస్ రామెన్ రెస్టారెంట్ స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేసింది. కస్టమర్లు భోజనం చేసేటప్పుడు ఫోన్లను ఉపయోగించడానికి అనుమతించబోమని ప్రకటించింది. టోక్యో రెస్టారెంట్ డెబు-చాన్ (“చబ్బీ” కోసం జపనీస్) వినియోగదారులు బిజీగా ఉన్న సమయంలో భోజనం చేసేటప్పుడు వారి స్మార్ట్ఫోన్లను ఉపయోగించకుండా నిషేధించాలని నిర్ణయించింది. ఈ చర్య జపాన్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వీడియోలు చూస్తూ స్మార్ట్ ఫోన్లను వాడడం (Restaurant)
ఓ కస్టమర్ భోజనం తినకుండా నాలుగు నిమిషాల పాటు స్మార్ట్ చూస్తూ కూర్చున్నాడట. ఆ దృశ్యాన్ని ఆ రెస్టారెంట్ (Restaurant)యజమాని కోట కై కంట్లో పడింది. స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చూస్తూ టైమ్ వేస్ట్ చేయడం కారణంగా ఆహారం చల్లబడుతుందని గ్రహించాడు. సన్నని నూడుల్స్ కేవలం ఒక మిల్లీమీటర్ వెడల్పు మాత్రమే,చల్లబడితే త్వరగా సాగదీయడం కష్టం. నాలుగు నిమిషాలు వేచి ఉండటం చెడ్డ భోజనంగా ఆ రెస్టారెంట్ యజామాని భావించాడు.
డెబు-చాన్ 33 సీట్లతో టోక్యో రామెన్ దుకాణం వద్ద ఉంది. పీక్ అవర్స్లో 10 మంది ఒక సీటు కోసం లైన్లో వేచి ఉండటం అసాధారణం కాదని కై చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వీడియోలు చూస్తూ స్మార్ట్ ఫోన్లను వాడడం కారణంగా పలు రకాలు ఇబ్బందులను కనిపెట్టాడు.
Also Read : Highest Railway Bridge in the World: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పై నుంచి ట్రైన్ రన్
తమ స్మార్ట్ఫోన్లను చూస్తూ భోజనం చేయడం ఆపివేయడాన్ని చూసి కస్టమర్లను అప్రమత్తం చేస్తాడంట కై. అయినప్పటికీ వీడియోలు చూడడం శాశ్వతంగా ఆపరట. స్మార్ట్ఫోన్ల వ్యసనం వల్ల ప్రతి సాధారణ మానవ కార్యకలాపాల సహజ ప్రవాహం దెబ్బతింటోంది. సినిమాలకు వెళ్లడం, వీధిలో నడవడం మరియు రెస్టారెంట్లో భోజనం చేయడంతో సహా మానవులు గాడ్జెట్తో బీజీగా ఉండిపోతున్నారని కై చూసి విసిగిపోయారట. అందుకే, తన రెస్టారెంట్లో అడుగు పెట్టాలంటే స్మార్ట్ ఫోన్ హ్యాండోవర్ చేయాలని నిబంధన పెట్టేశాడు. ఈ నిర్ణయం జపాన్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Also Read : World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు
స్మార్ట్ ఫోన్లు వ్యసనంగా మారిపోయిన రోజులు ఇవి. మాన సంబంధాలు తెగిపోతున్న ప్రమాదం వాటి వలన ఉంది. మైండ్ కు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ రెస్టారెంట్లలో భోజనం తినే సమయంలోనూ చూడడాన్ని వైద్యులు సైతం ప్రమాదం అంటున్నారు.