Ram Charan: జీ20 వేదిక‌పై నాటు నాటు సాంగ్‌.. దక్షిణ కొరియా రాయబారితో స్టెప్పులేసిన రామ్ చరణ్..!

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Resizeimagesize (1280 X 720) 11zon

Ram Charan: జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు. సోమవారం శ్రీనగర్‌లోని SKICC (షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్)లో ‘ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్’ అనే అంశంపై జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ 3వ మీటింగ్‌కు రామ్ చరణ్ హాజరయ్యారు. అంతకుముందు ఆయన శ్రీనగర్ విమానాశ్రయంలో కనిపించారు.

నాటు-నాటు పాటకు డ్యాన్స్

జీ20 వేదికపై భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌తో కలిసి రామ్ చరణ్ తన ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు పాటకి డాన్స్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడి అభిమానులు అతన్ని ‘ట్రూ గ్లోబల్ స్టార్’ అని పిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్ మయాంక్ శేఖర్‌తో రామ్ చరణ్ ఫిల్మ్ టూరిజం గురించి చర్చించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: RRR Actor Ray Stevenson: ‘ఆర్ఆర్ఆర్’లో విలన్ పాత్ర పోషించిన రే స్టీవెన్‌సన్ కన్నుమూత

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్‌లో పాటకు ముందు చాంగ్ జే-బోక్, అతని సిబ్బంది నాటు నాటుకు డ్యాన్స్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ పాటకు స్వరకర్త MM కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కింద ఆస్కార్‌ అవార్డును గెలుపొందారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మొదలైన ఈ సదస్సు మే 24 వరకు జరగనుంది. పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై జరుగుతున్న ఈ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు చరణ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే అరుదైన గౌరవం చరణ్‌కు దక్కింది. ఎంతో అద్భుతమై ప్రకృతి అందాలతో నిండి ఉండే కశ్మీర్‌లో ఈ కార్యక్రమం జరగడం హ్యాపీగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.

  Last Updated: 23 May 2023, 07:46 AM IST