Bihar: దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న కూతురిని అలా?

సాధారణంగా మద్యం సేవించిన వారు ఆ మధ్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 06:54 PM IST

సాధారణంగా మద్యం సేవించిన వారు ఆ మధ్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా మద్యం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతూ ఉంటారు. కావాలంటే ఎదుటి వ్యక్తులనే చంపడానికైనా వెనకాడరు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని మాదేపురాలో ఈ విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత్ర తోలాలో ఈ సంఘటన జరిగింది. మృతురాలి తండ్రి పేరు శివరామ్ సా.

మద్యం కోసం శివరామ్ తన 24 ఏళ్ళ కూతురు తలపై తుపాకీతో కాల్చాడు. కాగా మృతురాలు ఢిల్లీలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పెళ్లి నిమిత్తం గ్రామానికి తిరిగి వచ్చింది. పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కూడా కనింది. మృతురాలి తండ్రి శివరామ్ మద్యానికి బానిస అయ్యాడు. దాంతో యువతి కుటుంబ పోషణ కోసం ఢిల్లీలో ఒక ఉద్యోగం చేస్తోంది. ఇటీవల యువతికి పెళ్లి కూడా కుదిరింది. మే నెలలో పెళ్లి కూడా చేసుకోబోతోంది. పెళ్లికి ముందే ఆమె ఇల్లు కూడా కట్టుకుంది. అయితే కూతురికి డబ్బులు ఇవ్వాల్సిన ఆ తండ్రి మద్యం కోసం కూతురిని డబ్బులు ఇవ్వాలని తరచు వేధించేవాడు.

అయితే తాజాగా కూడా శివరామ్ తన కుమార్తె కొత్త ఇంటికి వెళ్లి తాగడానికి డబ్బులు అడిగాడు. ఇప్పుడు ఆ యువతి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కూతురితో గొడవకు దిగాడు. అంతేకాకుండా అందరి గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు కూతురు తండ్రికి నచ్చ చెప్పడంతో అప్పుడు శివరామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఒక వ్యక్తితో పాటు కలిసి తిరిగి వచ్చాడు శివరామ్. ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా కండువా చుట్టుకున్నాడు. ఇక సదరు యువతీతో మాట్లాడుతూ తలపై తుపాకితో కాల్చి మోటార్ సైకిల్ నుంచి పారిపోయాడు. తుపాకీ శబ్దం విన్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతీ చనిపోయినట్లు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు గుండెలు వెలసేలా రోదిస్తున్నారు.