కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీళ్ళకే పరిమితమయ్యారు. కరోనా వల్ల ప్రజలు కోట్లల్లో ఆర్థికంగా నష్టపోయారు. అంతేకాకుండా ఈ వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసింది. ఈ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారాలను కూడా బంద్ చేసుకున్నారు. అయితే ఇదే తరహాలో, గతంలో ప్రింటింగ్ ప్రెస్కు యజమానులుగా ఉన్న ఓ జంట లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక జంట ఫరీదాబాద్ లోని గేట్ నంబర్ 5 సమీపంలో గ్రీన్ఫీల్డ్ కాలనీలో ఉన్న వారి స్టాల్లో నిలబడి కర్రీస్ అమ్ముతూ ఉంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ జంట దగ్గరకీ వెళ్లి చూడగా వారిద్దరూ గతంలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు. షాకైన ఆ వ్యక్తి ఆ జంటను ఏం జరిగిందని అడగగా వాళ్లు మాట్లాడుతూ.. నేను ప్రింటింగ్ ప్రెస్ ని నడిపేవాడిని, కానీ లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరగలేదు. దీంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయాను. రాను రాను ప్రెస్ నష్టాలు పెరుగుతూ వచ్చాయి. దాంతో చేసేదేమి లేక ప్రెస్ను మూసేశాను.
ఆ తర్వాత బతుకడం కోసం నడిపేందుకు కొంతకాలం ఉద్యోగం చేసాను. అయితే మా రోజువారీ ఖర్చులకు అవసరమైన డబ్బు ఉద్యోగం ద్వారా సంపాదించే జీతంతో సరిపోయేవి కావు. దీంతో ఉద్యోగం వదిలేసి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నాను. నాకు, నా భార్యకు వంట చేయడం బాగా తెలుసు, అందుకే ఈ పుడ్ స్టాల్ పెట్టుకున్నాము అని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.