పుణేకు (Pune) చెందిన ఒక మహిళ చిలుకకు వీడ్కోలు పలుకుతున్న భావోద్వేగభరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్షణం ఎంతో మందిని అది చలించివేస్తోంది. ఈ వీడియోను ప్రొఫెషనల్ పక్షి పరిశీలకురాలు రాధికా ఇన్స్టాగ్రామ్లో “Goodbye Mitthu” అనే సరళమైన క్యాప్షన్తో షేర్ చేశారు.వీడియోలో చిలుకకు ఆ మహిళ ఇంటి బాల్కనీ రైలింగ్పై నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.. చిలుక ఒక ప్రత్యేక కారణంతో ఆమెను చూసేందుకు వచ్చినట్లు అనిపిస్తోంది. రాధికా పక్కనే కూర్చొని ఉండగా, వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ సున్నితమైన బంధం ప్రతి ఒక్కరినీ హృదయానికి అ భావం హత్తుకుంటోంది.రాధికా తన క్యాప్షన్లో ఇలా వివరిస్తూ చెప్పారు, “నేను ఇంటిని మారుస్తూ ప్యాకింగ్ చేస్తుండగా చిలుక అనుకోకుండా వచ్చింది. నేను ఊహించలేదు, వెళ్ళిపోవడానికి ముందు చివరిసారి చూస్తానని. ఆ క్షణం చాలా భావోద్వేగంగా అనిపించింది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తూ కూర్చున్నా… దానికి నిజంగా నేను వెళ్ళిపోతున్నాను అని తెలిసినట్లా?”
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అనేక భావోద్వేగ ప్రతిస్పందనలను రాబట్టింది. చాలామంది చిలుకపై ప్రేమతో కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశారు, “మిత్తూని వెంట తీసుకెళ్ళండి ప్లీజ్, అది మీ కోసం వచ్చి మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతుంది,” మరొకరు వ్యాఖ్యానిస్తూ, “ఇలాంటి క్షణాలు చాలా కష్టంగా ఉంటాయి. గుండెను తాకుతూ బాధ కలిగిస్తాయి. కొత్త పరిస్థితులకు అలవాటు పడటం చిలుకకు చాలా కష్టమే.”ఈ వీడియో మనుషులు మరియు ప్రకృతిలోని జంతువుల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని చాటిచెప్పడమే కాకుండా, వీడ్కోలు క్షణాలలో ఉన్న భావోద్వేగాలను చాలా అందంగా ప్రతిబింబ చేస్తుంది