Anand Mahindra : జింకలు, మనుషులని కలిపిన వర్షం.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..

తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు..

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 10:15 PM IST

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ, తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఆయన ఎప్పుడు ఏ విషయం మీద వీడియో షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్(Viral video ) అవుతుంటుంది. అంతగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసే వీడియోలు కొన్ని మానవ సంబంధాలను ఉద్దేశించి అయితే, మరి కొన్ని విజ్ఞానం పంచేవి, ఇంకొన్ని కొన్ని కొందరి సృజనాత్మకత బయటపెట్టేవి.

ఇప్పుడు తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు..

బయట బాగా వర్షం కురుస్తోంది. పాపం కొన్ని జింకలు తడిచిపోకుండా ఒకే చోట ఆశ్రయం పొందుతున్నాయి. ఎక్కడో తెలుసా ఓ హోటల్లో. మనుషులతోపాటు కొన్ని జింకలు ఓ హోటల్ లో కూర్చొని బయటకు చూస్తున్నాయి. జపాన్ లోని నారాలోని విల్డ్ సికా జింకలు, భారీ వర్షం, పిడుగులు పడుతుంటే అవి చక్కగా ఎంతగానో నమ్మే మనుష్యుల దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతున్నాయి. వాటిని ఫోటోలు తీసే వాళ్లకి ఫోజులు ఇస్తున్నాయి. ఆ వీడియో ఎంత అద్భుతం అంటే.. ప్రకృతిలో ఇలా ఉంటేనే కదా అందం అని అనిపించేలా.

ఆనంద్ మహేంద్రా కూడా అదే మాట ట్వీట్ చేశారు. ఈ వీడియోను సేవ్ చేసుకుని ప్రపంచం ఎలా ఉండాలో నాకు నేను గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చూస్తానన్నారు. ట్విట్టర్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఎప్పటిలాగే వైరల్ అవుతోంది.

 

Also Read : Rs 4 crore in 45 days : ట‌మోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు