Agra: దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన.. ఎక్కడంటే?

ప్రస్తుత సమాజంలో మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. చాలామంది మనుషులు ఎదుటి వ్యక్తి పట్ల అతి దారుణంగా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మానవులు అన

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 04:00 PM IST

ప్రస్తుత సమాజంలో మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. చాలామంది మనుషులు ఎదుటి వ్యక్తి పట్ల అతి దారుణంగా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మానవులు అన్న విషయాన్ని మరిచిపోయి జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో ఒక గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాంతో పోలీసు అధికారులు ప్రభుత్వం ఆ ఘటనపై స్పందిస్తూ అతనిపై తగిన చర్యలు తీసుకుంది. అయితే ఆ ఘటన ఇంకా మరువక ముందే తాజాగా అలాంటి కటనే ఒకటి ఆగ్రాలో చోటుచేసుకుంది.

అపస్మార్క స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై మూత్రం పోశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానవత్వం మంటగలిసిపోయే విధంగా, మానవత్వానికి కళంకం తెచ్చే విధంగా ఉండే ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆగ్రాలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 

మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆ ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆ వీడియో పై స్పందించిన నెటిజన్స్ సదరు వ్యక్తిపై మండిపడుతూ అతనిపై కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.