Video: విరిగిన భారీ ధ్వజస్తంభం.. తప్పిన ప్రాణప్రాయం!

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పడిటివారిపాలెంలో

Published By: HashtagU Telugu Desk
Viral

Viral

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పడిటివారిపాలెంలో ఒక దేవాలయం వద్ద భారీ ఆలయ స్తంభం విరిగి కిందపడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తృటిలో తప్పించుకున్నారు. అందుకు సంబంధించిన ఘటన వీడియోలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాల్లో తరచుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఓ ఆలయ దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండగా, క్రేన్స్ స్తంభాన్ని వదిలేయడంతో ధ్వజస్తంభం ఫైభాగం కూలీ కిందపడింది. ముప్పును పసిగట్టిన భక్తులు అక్కడ్నుంచి పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పిడుగురాళ్ల పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

  Last Updated: 22 Feb 2022, 04:43 PM IST