Southwest Monsoon : వేసవి వేడిలో మాడుతున్న భారతదేశానికి సాంత్వన చల్లని కబురు వచ్చేసింది. ఎప్పటికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు దూసుకొస్తుండటంతో ఈ సారి వేడి నుంచి ఉపశమనం త్వరగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Read Also: Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం దీనికి నిదర్శనం. రానున్న మూడు నుండి నాలుగు రోజుల్లో ఈ రుతుపవనాలు అండమాన్-నికోబార్ దీవుల మొత్తానికి, దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) వివరించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం, ఈ మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా. ఇది సాధారణ తేదైన జూన్ 1 కంటే ముందే. గతంలో 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకిన ఉదాహరణ ఉంది. అంటే, ఈసారి కూడా మానిటరింగ్ రికార్డులు తిరగరాయనున్నాయన్న మాట.
ఇక, వర్షపాతం విషయానికొస్తే ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది వ్యవసాయరంగానికి ఎంతో శుభవార్త. దేశ వ్యాప్తంగా 52 శాతం సాగుభూమికి వర్షమే ప్రాధాన్య ఆధారం. దాంతో పాటు, మొత్తం వ్యవసాయ దిగుబడిలో 40 శాతం ఈ భూముల నుంచే వస్తుంది. వర్షాలు కురిస్తే జలాశయాలు నిండుతాయి. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, నీటి ప్రాధాన్యత ఉన్న పారిశ్రామిక అవసరాలకు ఇది దోహదపడుతుంది. అంతేకాక, దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలోనూ నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎండ మీద ఉన్న దేశానికి ఈ వర్షాల వర్షం నిజమైన వరం అనడంలో సందేహం లేదు.
Read Also: AP Bhavan : ఏపీ భవన్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిపివేత