మానవత్వానికి ప్రతిరూపం సోనూసూద్. మానవసేవే మాధవసేవ అనే సూత్రాన్ని నమ్మిన మానవతావాది. సహాయం కోరే వాళ్ల వద్దకు పరుగెత్తి వచ్చే నైజం ఆయనది. తాజాగా పంజాబ్ లోని మోగా జిల్లా మీదుగా ఆయన ప్రయాణిస్తోన్న సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. వెంటనే స్పందించిన సోనూ అపస్మారక స్థితిలో కారులో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించాడు. సొంత కారులో బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. ఈ సంఘటనలోని పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్లోని కోటక్పురా బైపాస్ దగ్గర ఓ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. చెడిపోయిన కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ ప్రాంతం గుండా వెళుతున్న సోను ఆ దశ్యాన్ని చూశాడు. ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని తన చేతుల్లో ఎత్తుకున్నాడు. తన కారులోకి తరలించి నేరుగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స అందేలా దగ్గరుండి పర్యవేక్షించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ వ్యక్తి ప్రమాదం నుండి బయటపడ్డాడు.
Every Life Counts 🙏@SonuSood pic.twitter.com/veu5M6fcqU
— Sood Charity Foundation (@SoodFoundation) February 9, 2022
లాక్డౌన్ సమయంలోనూ వలస కార్మికులను ఇంటికి పంపడంలో సహాయపడటానికి సోనూ సూద్ ఏ మాత్రం వెనుకాడలేదు. ఇప్పుడు జరిగిన సంఘటనను వ్యక్తిగత మిషన్గా తీసుకున్నాడు. కోవిడ్-19 యొక్క రెండవ తరంగం సమయంలో సోనూ బృందం ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఆసుపత్రి పడకలతో ప్రజలకు సహాయం అందించారు. ఇంటి ఎదుట గుమిగూడిన వ్యక్తులతో సోనూ తరచూ మాట్లాడిన దృశ్యాలను చూశాం. ప్రస్తుతం రోడీస్కి కొత్త హోస్ట్గా రన్విజయ్ సింఘా స్థానంలో సోనూ వచ్చారు. ఆయన తాజాగా ఒక వ్యక్తి ప్రాణం కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.